రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- July 01, 2026
యూఏఈ: రాస్ అల్ ఖైమాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ స్టూడెంట్ మరణించాడు. సదరు స్టూడెంట్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ఓ ట్రైలర్ ను ఢీకొట్టింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ప్రమాదంలో మరణించిన 18 ఏళ్ల సలేం అల్ మజ్రూయీ తండ్రి అలీ రషీద్ అల్ మజ్రూయీ మాట్లాడుతూ.. ఫైనల్ పరీక్ష కోసం తన కుమారుడు 'అల్ ఘైల్'లోని తన ఇంటి నుండి రాస్ అల్ ఖైమాలోని 'అధెన్' ప్రాంతంలో ఉన్న పాఠశాలకు వెళ్తున్నాడని చెప్పాడు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనాన్ని నడుపుతున్న అతని స్నేహితుడు కూడా అతనితో పాటు ఉన్నాడని తెలిపాడు.
రోడ్డు కుడి వైపు నుండి ట్రక్కు అకస్మాత్తుగా ప్రధాన రహదారిపైకి వచ్చిందని, వాహనం నడుపుతున్నతన కుమారుడి స్నేహితుడు ఆ ట్రక్కును తప్పించుకోవడానికి ప్రయత్నించాడని, కానీ చివరకు వారు ఆ ట్రైలర్ వెనుక భాగాన్ని ఢీకొట్టారని వివరించాడు. ఈ ప్రమాదంలో సలేం మరణించగా, అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు.
తాజా వార్తలు
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!
- పవిత్ర కాబాలో వార్షిక వేడుక..ఊద్ నూనె, జమ్జమ్, గులాబీ నీటితో క్లీనింగ్..!!
- 46 ఇంజనీరింగ్ వృత్తులలో 30% సౌదీకరణ..!!







