రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- July 01, 2026
యూఏఈ: రాస్ అల్ ఖైమాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ స్టూడెంట్ మరణించాడు. సదరు స్టూడెంట్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ఓ ట్రైలర్ ను ఢీకొట్టింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ప్రమాదంలో మరణించిన 18 ఏళ్ల సలేం అల్ మజ్రూయీ తండ్రి అలీ రషీద్ అల్ మజ్రూయీ మాట్లాడుతూ.. ఫైనల్ పరీక్ష కోసం తన కుమారుడు 'అల్ ఘైల్'లోని తన ఇంటి నుండి రాస్ అల్ ఖైమాలోని 'అధెన్' ప్రాంతంలో ఉన్న పాఠశాలకు వెళ్తున్నాడని చెప్పాడు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనాన్ని నడుపుతున్న అతని స్నేహితుడు కూడా అతనితో పాటు ఉన్నాడని తెలిపాడు.
రోడ్డు కుడి వైపు నుండి ట్రక్కు అకస్మాత్తుగా ప్రధాన రహదారిపైకి వచ్చిందని, వాహనం నడుపుతున్నతన కుమారుడి స్నేహితుడు ఆ ట్రక్కును తప్పించుకోవడానికి ప్రయత్నించాడని, కానీ చివరకు వారు ఆ ట్రైలర్ వెనుక భాగాన్ని ఢీకొట్టారని వివరించాడు. ఈ ప్రమాదంలో సలేం మరణించగా, అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు.
తాజా వార్తలు
- రష్యాలో డ్రోన్ దాడి.. భారత విద్యార్థికి గాయాలు
- బెంగాల్ యువకుడికి అండగా నిలిచిన అనంత్ అంబానీ
- ఇండిగో వెబ్సైట్ క్రాష్.. ఆన్లైన్ సేవలకు తీవ్ర అంతరాయం..!
- అబుదాబిలో అక్రమంగా కార్ వాష్ చేస్తే Dh4,000 వరకు జరిమానా
- బహ్రెయిన్లో ఘోర అగ్నిప్రమాదం.. తల్లి, ముగ్గురు పిల్లలు మృతి
- షార్జాలో వాహన నంబర్ ప్లేట్ల సేకరణ సర్వీస్.. నూన్తో పోలీసుల భాగస్వామ్యం
- ఏపీ మున్సిపల్ పోరుకు సర్కార్ సిద్ధం..
- జెడ్డాలో ‘ఇండియా ఉత్సవ్’లో పాల్గొన్న కాన్సుల్ జనరల్ ఫహద్ సూరి
- గెలుపే లక్ష్యంగా పనిచేయండి.. పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం
- తప్పుదారి పట్టించిన డ్రైవింగ్.. అబుదాబిలో డ్రైవర్కు 6 నెలల జైలు, Dh100,000 జరిమానా







