మెగా రాకుమారుడి డబుల్ యాక్షన్ ధమాకా.!
- April 08, 2023
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదట్నుంచీ తాను ఎంచుకునే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాడు. కంటెంట్ రిచ్ సినిమాలకే ఎక్కువ ప్రాథాన్యత ఇస్తుంటాడు.
అందులో భాగంగానే ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాంఢీవ ధారి అర్జున’ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్తో ఇదో డిఫరెంట్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ అని తెలుస్తోంది.
దీంతో పాటూ మరో యాక్షన్ మూవీలోనూ వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకుడు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
గగన తలంలో హీరో చేసే యాక్షన్ ఘట్టాలు అబ్బుర పరిచేలా వుంటాయని అంటున్నారు. హాలీవుడ్ రేంజ్లో ఈ యాక్షన్ ఘట్లాలను డిజైన్ చేశారట. మానుషి చిల్లర్ హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాలో. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో చాలా హుందాగా, కొత్తగా కనిపించబోతున్నాడు మెగా రాకుమారుడు వరుణ్ తేజ్.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







