మెగా రాకుమారుడి డబుల్ యాక్షన్ ధమాకా.!
- April 08, 2023
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదట్నుంచీ తాను ఎంచుకునే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాడు. కంటెంట్ రిచ్ సినిమాలకే ఎక్కువ ప్రాథాన్యత ఇస్తుంటాడు.
అందులో భాగంగానే ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాంఢీవ ధారి అర్జున’ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్తో ఇదో డిఫరెంట్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ అని తెలుస్తోంది.
దీంతో పాటూ మరో యాక్షన్ మూవీలోనూ వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకుడు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
గగన తలంలో హీరో చేసే యాక్షన్ ఘట్టాలు అబ్బుర పరిచేలా వుంటాయని అంటున్నారు. హాలీవుడ్ రేంజ్లో ఈ యాక్షన్ ఘట్లాలను డిజైన్ చేశారట. మానుషి చిల్లర్ హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాలో. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో చాలా హుందాగా, కొత్తగా కనిపించబోతున్నాడు మెగా రాకుమారుడు వరుణ్ తేజ్.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









