భారత్ జాగృతి కువైట్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ కిట్ల పంపిణీ
- April 09, 2023
కువైట్ సిటీ: పవిత్ర రమదాన్ మాసంలో మానవతా విలువలను నిర్మించి, నిలబెట్టే ఆనందం, కృతజ్ఞత మరియు సహకారం అనే భావనను పెంపొందించడానికి ఈ సంయుక్త ప్రయత్నం ఒక సాధనం.కువైట్ లో ఉంటున్న ముస్లిం సోదరులకు భారత్ జాగృతి కువైట్ అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్ ఆధ్వర్యంలో లో ఇఫ్తార్ కిట్లు పంపిణీ జరిగింది.
భారత్ జాగృతి కువైట్ అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్ గారు మాట్లాడుతూ, ఇఫ్తార్ కిట్ల పంపిణీ నీ చేయడం తోటి ముస్లిం సోదరులకు సహాయపడటం మా అదృష్టంగా భావిస్తున్నాం అన్నారు.
భారత్ జాగృతి కువైట్ జనరల్ సెక్రెటరీ ప్రమోద్ కుమార్ మార్క , ట్రెజరర్ మామిడిపల్లి రాజన్న మాట్లాడుతూ కువైట్ లో ఉంటున్నా తెలంగాణ సోదరులకు భారత్ జాగృతి కువైట్ ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు అందిస్తుంది అని అన్నారు.
NRI BRS కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల మాట్లాడుతూ...పవిత్ర రమదాన్ మాసంలో ముస్లిం సోదరులకు ప్రతి సంవత్సరం లాగానే భారత్ జాగృతి కువైట్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ కిట్స్ పంపిణీ చేయడం సంతోషం గా ఉంది అన్నారు మరియు అందరికీ రమదాన్ ముబారక్ అలాగే ముందస్తు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గల్ఫ్ కాపు సంఘం కువైట్ అధ్యక్షులు జీలకర్ర మురళి రాయల్, NRI BRS కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, జనరల్ సెక్రటరీ సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)




--
తాజా వార్తలు
- ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..10 మంది రోగులు మృతి..
- టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..









