భారత్ జాగృతి కువైట్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ కిట్ల పంపిణీ

- April 09, 2023 , by Maagulf
భారత్ జాగృతి కువైట్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ కిట్ల పంపిణీ

కువైట్ సిటీ: పవిత్ర రమదాన్ మాసంలో మానవతా విలువలను నిర్మించి, నిలబెట్టే ఆనందం, కృతజ్ఞత మరియు సహకారం అనే భావనను పెంపొందించడానికి ఈ సంయుక్త ప్రయత్నం ఒక సాధనం.కువైట్ లో ఉంటున్న ముస్లిం సోదరులకు భారత్ జాగృతి కువైట్ అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్ ఆధ్వర్యంలో లో ఇఫ్తార్ కిట్లు పంపిణీ జరిగింది.

భారత్ జాగృతి కువైట్  అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్ గారు మాట్లాడుతూ, ఇఫ్తార్ కిట్ల పంపిణీ నీ చేయడం తోటి ముస్లిం సోదరులకు సహాయపడటం మా అదృష్టంగా భావిస్తున్నాం అన్నారు.

భారత్ జాగృతి కువైట్  జనరల్ సెక్రెటరీ ప్రమోద్ కుమార్ మార్క , ట్రెజరర్ మామిడిపల్లి రాజన్న మాట్లాడుతూ కువైట్ లో ఉంటున్నా తెలంగాణ సోదరులకు భారత్ జాగృతి కువైట్ ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు అందిస్తుంది అని అన్నారు.

NRI BRS కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల మాట్లాడుతూ...పవిత్ర రమదాన్ మాసంలో ముస్లిం సోదరులకు ప్రతి సంవత్సరం లాగానే భారత్ జాగృతి కువైట్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ కిట్స్ పంపిణీ చేయడం సంతోషం గా ఉంది అన్నారు మరియు అందరికీ రమదాన్ ముబారక్ అలాగే ముందస్తు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియచేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గల్ఫ్ కాపు సంఘం కువైట్ అధ్యక్షులు జీలకర్ర మురళి రాయల్, NRI BRS కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, జనరల్ సెక్రటరీ సురేష్ గౌడ్  తదితరులు పాల్గొన్నారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

--

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com