రవికుమార్ పనస నిర్మాతగా తొలి చిత్రం ప్రారంభం
- April 10, 2023
హైదరాబాద్: ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్ సమర్పణలో ఒక పిరియడ్ ఫిల్మ్ రూపొందుతోంది.రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్:1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త రవి కుమార్ పనస అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు.
మసూద లాంటి సూపర్ హిట్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా దగ్గరైన తిరువీర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. విభిన్న కథాంశంతో నూతన దర్శకుడు జి.జి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రాన్ని ప్రస్తుతాన్ని "ప్రొడక్షన్ నెంబర్ 1" గా పరిగణిస్తున్నారు.
ఎక్కడా రాజీ పడిన నిర్మాణ విలువలతో, మునుపెన్నడూ చూడని కథాంశంతో, ప్రతిభావంతులైన నటులతో, దర్శకుడితో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులని అలరిస్తుందని రవికుమార్ పనస అన్నారు.ఏషియన్ ఫిలింస్ సమర్పణలో ఈ సినిమాని తీస్తుండడం మరింత సంతోషదాయకమన్నారు. ఇది ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా జానర్ లో రూపొందుతోందని తెలిపారు రవికుమార్ పనస.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









