నగల దుకాణాల్లో దొంగతనం..ముగ్గురు ప్రవాసులు అరెస్ట్

- April 12, 2023 , by Maagulf
నగల దుకాణాల్లో దొంగతనం..ముగ్గురు ప్రవాసులు అరెస్ట్

రియాద్: బంగారం, నగల దుకాణాల్లో దొంగతనం చేసిన ముగ్గురు ప్రవాసులను రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ జాతీయత కలిగిన ప్రవాసులు కార్మిక చట్టం, రెసిడెన్సీ (ఇకామా) చట్టాన్ని ఉల్లంఘించినట్లు పోలీసులు తెలిపారు. వారు తప్పుడు గుర్తింపులు, దోపిడీ సంఘటనలకు పాల్పడ్డారని..  దొంగిలించిన వస్తువులతో కూడా వ్యాపారం చేశారని పోలీసులు వివరించారు. దొంగిలించబడిన కొన్ని వస్తువులను నిందితుల వద్దనుంచి స్వాధీనం చేసుకున్నట్లు రియాద్ పోలీసులు వెల్లడించారు.  నిందితులను అరెస్టు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అనంతరం వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com