నగల దుకాణాల్లో దొంగతనం..ముగ్గురు ప్రవాసులు అరెస్ట్
- April 12, 2023
రియాద్: బంగారం, నగల దుకాణాల్లో దొంగతనం చేసిన ముగ్గురు ప్రవాసులను రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ జాతీయత కలిగిన ప్రవాసులు కార్మిక చట్టం, రెసిడెన్సీ (ఇకామా) చట్టాన్ని ఉల్లంఘించినట్లు పోలీసులు తెలిపారు. వారు తప్పుడు గుర్తింపులు, దోపిడీ సంఘటనలకు పాల్పడ్డారని.. దొంగిలించిన వస్తువులతో కూడా వ్యాపారం చేశారని పోలీసులు వివరించారు. దొంగిలించబడిన కొన్ని వస్తువులను నిందితుల వద్దనుంచి స్వాధీనం చేసుకున్నట్లు రియాద్ పోలీసులు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అనంతరం వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









