ఏజెంట్ల చేతిలో మోసపోయిన భారతీయ మహిళ.. అండగా నిలిచిన ఎంబసీ
- April 13, 2023
బహ్రెయిన్: ఉద్యోగం ఇప్పిస్తానని ఎంప్లాయ్ మెంట్ ఏజెంట్ల ద్వారా బహ్రెయిన్కు వచ్చి మోసపోయిన భారత్కు చెందిన ఓ మహిళను భారత రాయబార కార్యాలయం సురక్షితంగా రక్షించి తిరిగి ఇండియాకు పంపింది. వివరాల్లోకి వెళితే.. నార్త్ గోవా జిల్లాలోని తిస్వాడి నివాసి అయిన 23 ఏళ్ల యువతి మంగళవారం దుబాయ్ మీదుగా ప్రయాణించి ఢిల్లీలో సురక్షితంగా దిగింది. ఆమె ఫిబ్రవరిలో ఏజెంట్ల ద్వారా బహ్రెయిన్ చేరుకున్నది. ఎంప్లాయ్ మెంట్ ఏజెన్సీతో ఒప్పందం కుదిరిన ఉద్యోగంలో కాకుండా.. ఆమెను గృహ సహాయకురాలుగా నియమించారు. అయితే, సదరు ఇంటి యజమాని వద్ద ఆమె పనిచేయడానికి నిరాకరించింది. దీంతో ఆమెపై దొంగతనం కేసు నమోదు చేయించారు. మొబైల్ ఫోన్ను లాక్కోని వేధింపులకు గురిచేశారు. అనంతరం ఆమె బహ్రెయిన్లోని ఎంబసీ అధికారులను సంప్రదించింది. ఆమె తన కేసు గురించి భారత రాయబార కార్యాలయానికి తెలియజేసింది. రాయబార కార్యాలయం భారతదేశంలోని ఆమె బంధువులను సంప్రదించింది. ఆ తర్వాత ఆమె మామ ముంబై క్రైమ్ బ్రాంచ్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో క్రైం బ్రాంచ్ అధికారులు జాబ్ ఏజెంట్లతో సంప్రదించారు. ఇదే సమయంలో అధికారులు గల్ఫ్-మహారాష్ట్ర బిజినెస్ ఫోరమ్ నుండి కూడా సహాయం కోరారు. చివరకు పోలీసులు, ఎంబసీ అధికారులు, ఫోరం కృషి ఫలించడంతో బాధిత మహిళ క్షేమంగా భారత్కు తిరిగివచ్చింది.
తాజా వార్తలు
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!







