భారత్ కరోనా అప్డేట్
- April 14, 2023న్యూ ఢిల్లీ: భారత్లో కొవిడ్ -19 విజృంభణ కొనసాగుతోంది. రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో 11,109 కొత్త కొవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 49,622కు చేరింది. కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ యొక్క కొత్త XBB.1.16 వేరియంట్ తీవ్రతకు దారితీస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా గణాంకాల ప్రకారం.. కరోనా కేసుల రికవరీ రేటు 98.71శాతం వద్ద కొనసాగుతుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.01శాతంగా నమోదైంది. వారానికి అనుకూలత రేటు 4.29శాతంగా ఉంది. 4,42,16,583 మంది ఇప్పటి వరకు కరోనా బారినపడి చికిత్స అనంతరం కోలుకున్నారు. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నెల 12న 7,830 కొత్త కేసులు నమోదు కాగా, 13న 10,158 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యయాయి. శుక్రవారం (14వ తేదీ) కొత్త కేసుల సంఖ్య 11,109కు చేరింది. గడిచిన 24గంటల వ్యవధిలో 29మంది కరోనాతో బాధపడుతూ మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,31,064కు పెరిగింది. మరణాల రేటు 1.19శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.
కొవిడ్ కారణంగా ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ముగ్గురు చొప్పున, ఛత్తీస్గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఇద్దరు చొప్పున, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం