రియాద్ బస్సు ప్రమాదంలో ఒకరు మృతి.. పలువురికి గాయాలు
- April 14, 2023
రియాద్: రియాద్ నగరంలో బస్సు వంతెన పై నుండి పడిపోయిన ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను రెస్క్యూ వర్కర్లు ఆసుపత్రికి తరలించినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ గురువారం తెలిపింది. సివిల్ డిఫెన్స్, జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సహకారంతో సహాయక చర్యలను చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. వంతెనలకు ఇరువైపులా ఉన్న ఇనుప కంచెలను కాంక్రీట్తో ఏర్పాటు చేయాలని పలువురు నెటిజన్లు పిలుపునిచ్చారు. ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడంతోపాటు వాహనాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన అవసరం కూడా ఉందని వారు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!







