రియాద్ బస్సు ప్రమాదంలో ఒకరు మృతి.. పలువురికి గాయాలు
- April 14, 2023
రియాద్: రియాద్ నగరంలో బస్సు వంతెన పై నుండి పడిపోయిన ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను రెస్క్యూ వర్కర్లు ఆసుపత్రికి తరలించినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ గురువారం తెలిపింది. సివిల్ డిఫెన్స్, జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సహకారంతో సహాయక చర్యలను చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. వంతెనలకు ఇరువైపులా ఉన్న ఇనుప కంచెలను కాంక్రీట్తో ఏర్పాటు చేయాలని పలువురు నెటిజన్లు పిలుపునిచ్చారు. ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడంతోపాటు వాహనాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన అవసరం కూడా ఉందని వారు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







