రియాద్ బస్సు ప్రమాదంలో ఒకరు మృతి.. పలువురికి గాయాలు
- April 14, 2023
రియాద్: రియాద్ నగరంలో బస్సు వంతెన పై నుండి పడిపోయిన ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను రెస్క్యూ వర్కర్లు ఆసుపత్రికి తరలించినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ గురువారం తెలిపింది. సివిల్ డిఫెన్స్, జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సహకారంతో సహాయక చర్యలను చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. వంతెనలకు ఇరువైపులా ఉన్న ఇనుప కంచెలను కాంక్రీట్తో ఏర్పాటు చేయాలని పలువురు నెటిజన్లు పిలుపునిచ్చారు. ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడంతోపాటు వాహనాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన అవసరం కూడా ఉందని వారు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







