మార్చిలో 25 శాతం పెరిగిన విమాన ప్రయాణీకులు
- April 14, 2023
ఖతార్: 2023 మార్చి నెలలో ఖతార్ లో విమాన ప్రయాణికుల సంఖ్య 25 శాతం పెరిగిందని ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (QCAA) విడుదల చేసిన ఎయిర్ ట్రాన్స్పోర్ట్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. QCAA నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం మార్చిలో మొత్తం 3,516,939 విమాన ప్రయాణీకులు ప్రయాణించారు. ఇది 2022లో అదే కాలంలో నమోదైన 2,813,043తో పోలిస్తే 25 శాతం పెరుగుదలను నమోదు చేసింది. మార్చి 2023లో విమానాల ప్లోటింగ్ 12.9 శాతం వృద్ధిని నమోదు చేసిందని, 2022లో మొత్తం 19,561 విమానాలు(2021లో 17,320) నమోదయ్యాయని పేర్కొంది. కాగా, కార్గో, మెయిల్ 206,276 టన్నులు నమోదు కాగా.. గతేడాది (2022లో 217,676 టన్నులు) 5.2 శాతం తగ్గుదల నమోదైంది. మార్చి నెలలో హమద్, దోహా అంతర్జాతీయ విమానాశ్రయాలలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉందని నివేదిక తెలిపింది. FIFA ప్రపంచ కప్ 2022 సందర్భంగా ఖతార్ ని 1.4 మిలియన్ల మంది సందర్శించారు. 2023లో ప్రముఖ గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్గా ఖతార్ స్థానాన్ని బలోపేతం చేయడం, 2030 నాటికి ఏటా 6 మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షించడం, స్థూల దేశీయోత్పత్తి (GDP)కి పర్యాటక రంగం సహకారాన్ని 12 శాతానికి పెంచడం వంటి కార్యక్రమాలను ఖతార్ టూరిజం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







