విద్యాశాఖలో ప్రవాసుల తొలగింపు తాత్కాలికంగా నిలిపివేత..!
- April 16, 2023
కువైట్: ప్రవాస ఉపాధ్యాయ, సిబ్బంది తొలగింపు విధానాన్ని మరోసారి కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అర్హత కలిగిన కువైటీలు, GCC జాతీయులు లేదా కువైట్ తల్లుల పిల్లలు భర్తీ చేయడానికి అందుబాటులో ఉండే వరకు ప్రవాస సిబ్బంది తొలగింపును తాత్కలికంగా నిలిపివేయనున్నట్లు సమాచారం. స్థానిక వార్త పత్రికల కథనాల ప్రకారం.. ఇప్పటికే తొలగించబడిన వారి స్థానంలో నియమించేందుకు అర్హులైన స్థానికులు అందుబాటులో లేరని, కువైటైజేషన్ విధానాన్ని నెమ్మదిగా కొనసాగించాలని ఉపాధ్యాయుల సంఘం డిమాండ్లను మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విద్యా స్థాయి ప్రమాణాలు అకస్మాత్తుగా పడిపోకుండా ఉండటానికి, అర్హత కలిగిన కువైటీల లభ్యతను నిర్ధారించి, అదే స్థాయిలో పనితీరును ప్రదర్శించగల వారి సామర్థ్యాన్ని నిర్ణయించిన తర్వాత మాత్రమే తదుపరి తొలగింపులు జరుగుతాయని విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్లో బంగారు బార్స్ ను గెలుచుకున్న భారతీయులు..!!
- బిదియాలో ప్రమాదకరంగా వాగు దాటిన ఇద్దరు అరెస్టు..!!
- లెబనాన్ను వెంటనే విడిచి వెళ్లండి: సౌదీ అరేబియా
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన పీఎం..!!
- దమ్మామ్ నుండి కార్యకలాపాలను పొడిగించిన గల్ఫ్ ఎయిర్..!!
- అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో ఖతార్ ప్రధాన మంత్రి భేటీ..!!
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి









