విద్యాశాఖలో ప్రవాసుల తొలగింపు తాత్కాలికంగా నిలిపివేత..!
- April 16, 2023
కువైట్: ప్రవాస ఉపాధ్యాయ, సిబ్బంది తొలగింపు విధానాన్ని మరోసారి కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అర్హత కలిగిన కువైటీలు, GCC జాతీయులు లేదా కువైట్ తల్లుల పిల్లలు భర్తీ చేయడానికి అందుబాటులో ఉండే వరకు ప్రవాస సిబ్బంది తొలగింపును తాత్కలికంగా నిలిపివేయనున్నట్లు సమాచారం. స్థానిక వార్త పత్రికల కథనాల ప్రకారం.. ఇప్పటికే తొలగించబడిన వారి స్థానంలో నియమించేందుకు అర్హులైన స్థానికులు అందుబాటులో లేరని, కువైటైజేషన్ విధానాన్ని నెమ్మదిగా కొనసాగించాలని ఉపాధ్యాయుల సంఘం డిమాండ్లను మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విద్యా స్థాయి ప్రమాణాలు అకస్మాత్తుగా పడిపోకుండా ఉండటానికి, అర్హత కలిగిన కువైటీల లభ్యతను నిర్ధారించి, అదే స్థాయిలో పనితీరును ప్రదర్శించగల వారి సామర్థ్యాన్ని నిర్ణయించిన తర్వాత మాత్రమే తదుపరి తొలగింపులు జరుగుతాయని విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







