విద్యాశాఖలో ప్రవాసుల తొలగింపు తాత్కాలికంగా నిలిపివేత..!
- April 16, 2023
కువైట్: ప్రవాస ఉపాధ్యాయ, సిబ్బంది తొలగింపు విధానాన్ని మరోసారి కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అర్హత కలిగిన కువైటీలు, GCC జాతీయులు లేదా కువైట్ తల్లుల పిల్లలు భర్తీ చేయడానికి అందుబాటులో ఉండే వరకు ప్రవాస సిబ్బంది తొలగింపును తాత్కలికంగా నిలిపివేయనున్నట్లు సమాచారం. స్థానిక వార్త పత్రికల కథనాల ప్రకారం.. ఇప్పటికే తొలగించబడిన వారి స్థానంలో నియమించేందుకు అర్హులైన స్థానికులు అందుబాటులో లేరని, కువైటైజేషన్ విధానాన్ని నెమ్మదిగా కొనసాగించాలని ఉపాధ్యాయుల సంఘం డిమాండ్లను మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విద్యా స్థాయి ప్రమాణాలు అకస్మాత్తుగా పడిపోకుండా ఉండటానికి, అర్హత కలిగిన కువైటీల లభ్యతను నిర్ధారించి, అదే స్థాయిలో పనితీరును ప్రదర్శించగల వారి సామర్థ్యాన్ని నిర్ణయించిన తర్వాత మాత్రమే తదుపరి తొలగింపులు జరుగుతాయని విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా-ఇరాన్ చర్చలు: పాకిస్థాన్ ‘డబుల్ గేమ్’పై ట్రంప్ ఆగ్రహం
- ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం
- దుబాయ్లో ప్రైవేట్ పాఠశాలలకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు
- ఏపీలో రేపటి నుంచి ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్
- కాషాయమయంగా కొండగట్టు దేవాలయం
- కేరళం సీఎం పదవి ఎవరికీ దక్కుతుందో?
- ఓల్డ్ దోహా పోర్ట్ చేపల వేట పోటీ వాయిదా..!!
- సాహెల్ యాప్ ద్వారా విమాన ప్రయాణ ఫిర్యాదులు నమోదు..!!
- ఒమన్కు తదుపరి భారత రాయబారిగా ప్రశాంత్ పిసే నియామకం..!!
- మలిహా రోడ్డు నుండి 3-లేన్ల బ్రిడ్జిని నిర్మించనున్న షార్జా..!!









