విద్యాశాఖలో ప్రవాసుల తొలగింపు తాత్కాలికంగా నిలిపివేత..!
- April 16, 2023
కువైట్: ప్రవాస ఉపాధ్యాయ, సిబ్బంది తొలగింపు విధానాన్ని మరోసారి కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అర్హత కలిగిన కువైటీలు, GCC జాతీయులు లేదా కువైట్ తల్లుల పిల్లలు భర్తీ చేయడానికి అందుబాటులో ఉండే వరకు ప్రవాస సిబ్బంది తొలగింపును తాత్కలికంగా నిలిపివేయనున్నట్లు సమాచారం. స్థానిక వార్త పత్రికల కథనాల ప్రకారం.. ఇప్పటికే తొలగించబడిన వారి స్థానంలో నియమించేందుకు అర్హులైన స్థానికులు అందుబాటులో లేరని, కువైటైజేషన్ విధానాన్ని నెమ్మదిగా కొనసాగించాలని ఉపాధ్యాయుల సంఘం డిమాండ్లను మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విద్యా స్థాయి ప్రమాణాలు అకస్మాత్తుగా పడిపోకుండా ఉండటానికి, అర్హత కలిగిన కువైటీల లభ్యతను నిర్ధారించి, అదే స్థాయిలో పనితీరును ప్రదర్శించగల వారి సామర్థ్యాన్ని నిర్ణయించిన తర్వాత మాత్రమే తదుపరి తొలగింపులు జరుగుతాయని విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







