భారత్ లో కొత్తగా 7,633 కరోనా కేసులు
- April 18, 2023
న్యూ ఢిల్లీ: భారత దేశంలో రోజువారీ కరోనా కేసులు మొన్నటి కంటే నిన్న కాస్త తగ్గాయి. భారత్ లో మొన్న మొత్తం కలిపి 9,111 కొవిడ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. కొత్తగా 7,633 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇవాళ తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 61,233గా నమోదైందని వివరించింది.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.14గా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.63 శాతంగా నమోదైందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 5. 04 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 6,702 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వివరించింది.
దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,42,42,474కి చేరింది. రివకరీ రేటు 98.68 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో 749 వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపింది.
దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం కలిపి 92.43 కోట్ల పరీక్షలు చేశారని వివరించింది. గత 24 గంటల్లో 2,11,029 పరీక్షలు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB1.16 వ్యాప్తి చెందుతోంది. దీనిపై ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర సర్కారు అప్రమత్తం చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







