భారత్ లో కొత్తగా 7,633 కరోనా కేసులు
- April 18, 2023
న్యూ ఢిల్లీ: భారత దేశంలో రోజువారీ కరోనా కేసులు మొన్నటి కంటే నిన్న కాస్త తగ్గాయి. భారత్ లో మొన్న మొత్తం కలిపి 9,111 కొవిడ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. కొత్తగా 7,633 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇవాళ తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 61,233గా నమోదైందని వివరించింది.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.14గా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.63 శాతంగా నమోదైందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 5. 04 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 6,702 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వివరించింది.
దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,42,42,474కి చేరింది. రివకరీ రేటు 98.68 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో 749 వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపింది.
దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం కలిపి 92.43 కోట్ల పరీక్షలు చేశారని వివరించింది. గత 24 గంటల్లో 2,11,029 పరీక్షలు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB1.16 వ్యాప్తి చెందుతోంది. దీనిపై ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర సర్కారు అప్రమత్తం చేసింది.
తాజా వార్తలు
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్









