భారత్ లో కొత్తగా 7,633 కరోనా కేసులు
- April 18, 2023
న్యూ ఢిల్లీ: భారత దేశంలో రోజువారీ కరోనా కేసులు మొన్నటి కంటే నిన్న కాస్త తగ్గాయి. భారత్ లో మొన్న మొత్తం కలిపి 9,111 కొవిడ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. కొత్తగా 7,633 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇవాళ తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 61,233గా నమోదైందని వివరించింది.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.14గా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.63 శాతంగా నమోదైందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 5. 04 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 6,702 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వివరించింది.
దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,42,42,474కి చేరింది. రివకరీ రేటు 98.68 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో 749 వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపింది.
దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం కలిపి 92.43 కోట్ల పరీక్షలు చేశారని వివరించింది. గత 24 గంటల్లో 2,11,029 పరీక్షలు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB1.16 వ్యాప్తి చెందుతోంది. దీనిపై ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర సర్కారు అప్రమత్తం చేసింది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







