మరో రెండు రోజులు.. తెలంగాణలో భానుడి భగభగలు..
- April 19, 2023
హైదరాబాద్: వేసవి కాలం వచ్చేసింది. ఏప్రిల్ మొదటి వారం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఏకంగా 44 డిగ్రీలు వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.దీనికితోడు వేడి గాలులు , ఉక్కపోత తో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు సాయంత్రం వేళ ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మంగళవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో గరిష్ఠంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణలో భానుడి భగ్గుమంటున్నాడు. గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం 11 జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 44 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. బుధ, గురువారాల్లోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. సుమారు 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 21వ తేదీ తరువాత మూడు రోజులపాటు కొంత ఉపశమనం లభిస్తుందని, ఆ తరువాత మళ్లీ ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వడదెబ్బతో రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మరణించారు.
మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 11 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, జగిత్యాల జిల్లాలో 44.8, హనుమకొండ జిల్లాలో 44.7, అదిలాబాద్ జిల్లాలో 44.4, మంచిర్యాల జిల్లాలో 44.3 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా, పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, నాగర్కర్నూల్ జిల్లాల్లో 44.2, నల్గొండ జిల్లాలో 44.1, వనపర్తి జిల్లాలో 44 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







