మరో రెండు రోజులు.. తెలంగాణలో భానుడి భగభగలు..
- April 19, 2023
హైదరాబాద్: వేసవి కాలం వచ్చేసింది. ఏప్రిల్ మొదటి వారం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఏకంగా 44 డిగ్రీలు వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.దీనికితోడు వేడి గాలులు , ఉక్కపోత తో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు సాయంత్రం వేళ ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మంగళవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో గరిష్ఠంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణలో భానుడి భగ్గుమంటున్నాడు. గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం 11 జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 44 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. బుధ, గురువారాల్లోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. సుమారు 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 21వ తేదీ తరువాత మూడు రోజులపాటు కొంత ఉపశమనం లభిస్తుందని, ఆ తరువాత మళ్లీ ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వడదెబ్బతో రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మరణించారు.
మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 11 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, జగిత్యాల జిల్లాలో 44.8, హనుమకొండ జిల్లాలో 44.7, అదిలాబాద్ జిల్లాలో 44.4, మంచిర్యాల జిల్లాలో 44.3 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా, పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, నాగర్కర్నూల్ జిల్లాల్లో 44.2, నల్గొండ జిల్లాలో 44.1, వనపర్తి జిల్లాలో 44 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!









