ఖతార్ సరిహద్దులో నమోదిత వాహనాల కోసం ప్రత్యేక లేన్
- April 20, 2023
దోహా: ఈద్ అల్ ఫితర్ వేడుకలకు రెండ్రోజుల ముందు అబూ సమ్రా సరిహద్దును దాటే ప్రీ-రిజిస్టర్డ్ వాహనాలకు ఒక లేన్ను కేటాయించనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) వెల్లడించింది. దేశంలోకి వీసా సేవల కోసం హయ్యా ప్లాట్ఫారమ్ను విస్తరించనున్నట్లు పేర్కొంది. Metrash2 ద్వారా పౌరులు, నివాసితులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ముందస్తు నమోదు ద్వారా సమయం ఆదా అవ్వడంతోపాటు క్యూలను నిరోధిస్తుందని మంత్రిత్వ శాఖ తన ట్వీట్ లో తెలిపింది. మరోవైపు ఖతార్ టూరిజం హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అబూ సమ్రా సరిహద్దుకు వచ్చే సందర్శకులు ఈద్ అల్-ఫితర్ 2023 సందర్భంగా ప్రత్యేక ‘ఈద్య’ బహుమతి ప్యాకేజీని అందుకోనున్నట్లు ప్రకటించింది. సందర్శకులకు పర్యాటక అనుభవాన్ని మెరుగుపరచడం, ప్రయాణికులకు స్వాగతించే గమ్యస్థానంగా ఖతార్ను ప్రోత్సహించడం ఈ చొరవ లక్ష్యమని పేర్కొంది. గత సంవత్సరం, జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ (GAC) ఈద్ అల్ ఫితర్ వేడుకల సందర్భంగా అబూ సమ్రా ద్వారా ఖతార్లోకి ప్రవేశించే/నిష్క్రమించే 62,628 వాహనాలకు సేవలు అందించినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు
- ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ
- ఉగ్రవాదం పై రాజీ లేదు: ప్రధాని మోదీ
- కొత్త IT చట్టం రూల్స్
- బూతు రాజకీయాలు, పోలింగ్ బూత్లోనే సమాధానం: వెంకయ్య నాయుడు
- 'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- ఒమన్లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!









