శాంతియుతంగా రంజాన్ వేడుకలు: సీపీ చౌహాన్
- April 21, 2023
హైదరాబాద్: రంజాన్ పండుగ సంధర్భంగా చేపట్టవలసిన భద్రతా ఏర్పాట్లు, మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కమిషనర్ డి.ఎస్.చౌహాన్ రాచకొండ జోనల్ డీసీపీలు, ఏసిపిలు మరియు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయ సమావేశం ఈరోజు Neradmet CP officeలో నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో సున్నితమైన ప్రదేశాలలో రంజాన్ వేడుకల సమయంలో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు శాంతియుతంగా, సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులతో సహకరించాలని తెలిపారు.
ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొనే సామూహిక ప్రార్థనల వంటి కార్యక్రమాల బందోబస్తు సమయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
బందోబస్తు ఏర్పాట్లు చేసే సందర్భంలో తగిన సమర్థవంతమైన అధికారులకు విధులు అప్పగించాలని సూచించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, ఆయా ప్రాంతాల్లో సీసీటీవీల పనితీరును పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సామూహిక ప్రార్థనల సమయంలో రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ లు ఏర్పడకుండా, ఇతర సాధారణ ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో మత సామరస్యం కాపాడడానికి అవసరమైన అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జాయింట్ కమిషనర్ సత్యనారాయణ, డిసిపి బాలస్వామి,ఏసిపి జావేద్, ఏసిపి జగదీష్ చందర్, ఏసిపిలు, ఇన్స్పెక్టర్లు మరియు ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









