విదేశీ కరెన్సీ..టీటీడీకి కేంద్ర ప్రభుత్వం ఊరట
- April 21, 2023
తిరుమల: టీటీడీకి (తిరుమల తిరుపతి దేవస్థానం) కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. శ్రీవారికి భక్తులు సమర్పించే ఫారిన్ కరెన్సీని బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు కేంద్రం అంగీకరించింది. ఫారిన్ కరెన్సీ సమర్పించిన దాతల వివరాలు లేకపోయినా బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు టీటీడీకి మినహయింపునిచ్చింది.
భక్తులు శ్రీవారికి సమర్పించిన కానుకలుగా వాటిని పేర్కొనాలని కేంద్రం కోరింది. సెక్షన్ 50 ప్రకారం టీటీడీకి మాత్రమే ఇలాంటి మినహాయింపు ఇస్తున్నట్లు టీటీడీకి సమాచారం ఇచ్చారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ముత్తుకుమార్.
గతంలో ఫారిన్ కరెన్సీ డిపాజిట్ల వ్యవహారంలో టీటీడీకి రూ.3కోట్ల జరిమానా విధించింది కేంద్రం. జరిమానా చెల్లించిన అనంతరం ఫారిన్ కరెన్సీ డిపాజిట్ చేసుకునేందుకు లైసెన్స్ రెన్యువల్ చేసింది కేంద్రం. లైసెన్స్ రెన్యువల్ చేసినా.. ఫారిన్ కరెన్సీ డిపాజిట్ చేసే సమయంలో దాతల వివరాలు తెలపాలన్న నిబంధనను మాత్రం కేంద్రం సడలించలేదు. తాజాగా టీటీడీ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









