భారత్ లో కొత్తగా 12,193 కరోనా కేసులు
- April 22, 2023న్యూఢిల్లీ: భారత దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,193 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 67,556కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. కరోనా కారణంగా శుక్రవారం 42 మరణాలు సంభవించాయని వెల్లడించింది. వీరిలో పది మంది కేరళవాసులని తెలిపింది. తాజాగా లెక్కల ప్రకారం..కరోనా సంక్షోభం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ దేశంలో 4,48,81,877 కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం 5,31,300 మంది అసువులు బాసారు.
ఇక దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం 0.15గా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. జాతీయ సగటు రికవరీ రేటు 98.66 శాతమని పేర్కొంది. అంతేకాకుండా, ఇప్పటివరకూ 220.66 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేసినట్టు పేర్కొంది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి