బొప్పాయి తింటున్నారా.? ఈ జాగ్రత్తలు పాఠిస్తే మంచిది.!
- April 22, 2023బొప్పాయి పండు. చూడగానే నోరూరించే పండు. అరోగ్యానికి ముఖ్యంగా డెంగ్యూతో బాధపడేవారు బొప్పాయి అధికంగా తింటే ప్లేట్లెట్స్ వృద్ధి చెందుతాయని వైద్యులు చెబుతారు. బొప్పాయి పండుతో పాటూ, ఆకు రసం కూడా డెంగ్యూ టైమ్లో కీలక పాత్ర పోషిస్తుంది.
అవును నిజమే, బొప్పాయిలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా వుంటాయ్. బొప్పాయి పండును గర్భిణీ స్ర్తీలు తింటే గర్భస్రావం అవతుందని అంటారు. బాలింతలు పచ్చి బొప్పాయి కూరను తింటే బిడ్డకి సరిపడా పాలు పడతాయని అంటున్నారు.
సరే, ఆ సంగతి పక్కన పెడితే, కొన్ని కొన్ని సందర్భాల్లో తప్ప బొప్పాయి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే, కొన్నిరకాల ఆహార పదార్ధాలతో బొప్పాయిని కలిపి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్న మాట.
పెరుగుతో బొప్పాయిని కలిపి తీసుకోకూడదట. అలా చేస్తే రక్త హీనత సమస్య తలెత్తుతుందట.
అలాగే, ఆరెంజ్, నిమ్మకాయలతో కలిపి బొప్పాయి పండు తీసుకోవడం మంచిది కాదట. అలా చేయడం వల్ల విరుద్ధమైన జీవక్రియ జరిగి అతిసారం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయట.
సో, బొప్పాయితో కాస్త జాగ్రత్త సుమా.!
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు