అబుధాబిలో కారు ప్రమాదం..భారతీయ ప్రవాసుడు మృతి
- April 23, 2023
యూఏఈ: అబుధాబి అల్ మఫ్రాక్ ప్రాంతంలో జరిగిన ఓ కారు ప్రమాదంలో ప్రవాస భారతీయుడు మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన సుబీష్ చోజియంపరంబత్ 36 ఏళ్లు నిండడానికి సరిగ్గా ఒక నెల ముందు ఏప్రిల్ 20న మరణించాడు. ఇదే ప్రమాదంలో గాయపడ్డ ఒకరు తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరొక వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు సుబీష్ బంధువు వెల్లడించారు. గత రెండేళ్లుగా అబుధాబిలో నివాసముంటున్న సుబీష్ ల్యాండ్స్కేపింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో తను పెళ్లి చేసుకోవాల్సి ఉంది. ఈద్ అల్ ఫితర్ సెలవులకు ముందు షాపింగ్ కోసం సుబీష్ ఇతరులతో కలిసి అతను నివసించే అల్ సమ్హా నుండి ముస్సాఫాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!









