అబుధాబిలో కారు ప్రమాదం..భారతీయ ప్రవాసుడు మృతి
- April 23, 2023
యూఏఈ: అబుధాబి అల్ మఫ్రాక్ ప్రాంతంలో జరిగిన ఓ కారు ప్రమాదంలో ప్రవాస భారతీయుడు మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన సుబీష్ చోజియంపరంబత్ 36 ఏళ్లు నిండడానికి సరిగ్గా ఒక నెల ముందు ఏప్రిల్ 20న మరణించాడు. ఇదే ప్రమాదంలో గాయపడ్డ ఒకరు తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరొక వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు సుబీష్ బంధువు వెల్లడించారు. గత రెండేళ్లుగా అబుధాబిలో నివాసముంటున్న సుబీష్ ల్యాండ్స్కేపింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో తను పెళ్లి చేసుకోవాల్సి ఉంది. ఈద్ అల్ ఫితర్ సెలవులకు ముందు షాపింగ్ కోసం సుబీష్ ఇతరులతో కలిసి అతను నివసించే అల్ సమ్హా నుండి ముస్సాఫాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







