బ్రిటీష్ రాజకుటుంబం సంచలన నిర్ణయం..
- April 23, 2023
లండన్: బ్రిటీష్ రాజకుటుంబం సంచలన నిర్ణయం తీసుకుంది. మే 6న జరిగే కింగ్ చార్లెస్ (మూడో) పట్టాభిషేకంలో అతని భార్య కెమిల్లా పార్కర్ కోహినూర్ పొదిగిన రాజ కిరీటాన్ని ధరించరాదని బ్రిటన్ రాజకుటుంబం నిర్ణయించింది. కోహినూర్కు సంబంధించి వివాదం తలెత్తుతుందనే భయంతో ప్యాలెస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆమె భారతదేశ అసంతృప్తిని అర్థం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ఓ వ్యక్తి తెలియజేశారు. ఈ విషయంపై, ‘ది డైలీ టెలిగ్రాఫ్’ వార్తాపత్రిక అసోసియేట్ ఎడిటర్ కెమిల్లా టోమినీ, PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. బ్రిటిష్ రాజకుటుంబం వివాదాల్లోకి రాకూడదని.. కెమిల్లా పార్కర్ కోహినూర్ పొడుగుచేసిన రాజ కిరీటాన్ని ధరించకూడదని నిర్ణయించుకుంది.
కోహినూర్ వివాదాస్పదమైన విషయంపై ప్యాలెస్ ఆలోచనతో ఉందని.. అందుకే తాము ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. ఈ వజ్రాల మూలం గురించి ఎలాంటి సైడ్ స్టోరీ సృష్టించడం బ్రిటిష్ రాజకుటుంబానికి ఇష్టం లేదు.వచ్చే నెల మే 6న కింగ్ చార్లెస్ III , క్వీన్ కెమిల్లా పట్టాభిషేకం జరగనుంది.
ప్యాలెస్ నుంచి ఒక ప్రకటన జారీ చేయడం ద్వారా.. క్వీన్ మేరీ కిరీటాన్ని మార్చడానికి సూచనలు ఇచ్చారు. క్వీన్ మేరీ కిరీటంలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు ప్యాలెస్ తెలిపింది. క్వీన్ ఎలిజబెత్ II వ్యక్తిగత ఆభరణాల సేకరణలో చాలా సంవత్సరాలుగా భాగమైన కుల్లినన్-3, 4, 5 వజ్రాలను చేర్చడం వంటివి ఇందులో ఉన్నాయి.
బ్రిటీష్ రాజకుటుంబంలోని పురుషులు కోహినూర్ శాపగ్రస్తమైందని నమ్ముతారు. కాబట్టి వారు దానికి దూరంగా ఉంటారు. కోహినూర్ వజ్రం తమదేనంటూ పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్లెయిమ్ చేస్తున్నాయి. మరోవైపు కోహినూర్ను భారత్కు తీసుకురావాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది.
బ్రిటన్లో ఉన్న కోహినూర్ని… మన దేశానికి తిరిగి రప్పించాలని ఎంతో ప్రయత్నం జరుగుతోంది. అయితే.. ఆ పోరాటం ఫలించే రోజు రానే వస్తోంది. ఎలిజబెత్-2 కన్నుమూయడంతో… బ్రిటన్ రాజు చార్లెస్ 3 పట్టాభిషేకం జరగనున్న సమయంలో రాజవంశం కీలక నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









