పబ్లిక్, కమ్యూనిటీ సంక్షేమ సంస్థలకు గుడ్ న్యూస్
- April 24, 2023
యూఏఈ: ప్రజా, కమ్యూనిటీ సంక్షేమానికి దోహదపడే సంస్థలను కార్పొరేట్ పన్ను నుండి మినహాయించినట్లు యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది ఈ సంవత్సరం అమలులోకి వస్తుందని తెలిపింది. ప్రజా సంక్షేమం, దాతృత్వం, కమ్యూనిటీ సర్వీసెస్ లేదా కార్పొరేట్, సామాజిక బాధ్యతపై దృష్టి సారించిన కంపెనీలు కార్పొరేట్ పన్ను నుండి మినహాయించబడతాయని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. యూఏఈ గత సంవత్సరం Dh375,000 అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్న కంపెనీలు, ఫ్రీలాన్సర్లపై తొమ్మిది శాతం కార్పొరేట్ పన్ను విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు యూఏఈ కార్పొరేట్ పన్ను ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, మినహాయింపుకు అర్హత పొందేందుకు, ఈ సంస్థలు తప్పనిసరిగా కార్పొరేట్ పన్ను చట్టంలోని ఆర్టికల్ (9)లోని షరతులను తప్పక పాటించాలని, అవి అన్ని సంబంధిత సమాఖ్య, స్థానిక చట్టాలకు అనుగుణంగా కొనసాగాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







