పబ్లిక్, కమ్యూనిటీ సంక్షేమ సంస్థలకు గుడ్ న్యూస్
- April 24, 2023
యూఏఈ: ప్రజా, కమ్యూనిటీ సంక్షేమానికి దోహదపడే సంస్థలను కార్పొరేట్ పన్ను నుండి మినహాయించినట్లు యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది ఈ సంవత్సరం అమలులోకి వస్తుందని తెలిపింది. ప్రజా సంక్షేమం, దాతృత్వం, కమ్యూనిటీ సర్వీసెస్ లేదా కార్పొరేట్, సామాజిక బాధ్యతపై దృష్టి సారించిన కంపెనీలు కార్పొరేట్ పన్ను నుండి మినహాయించబడతాయని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. యూఏఈ గత సంవత్సరం Dh375,000 అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్న కంపెనీలు, ఫ్రీలాన్సర్లపై తొమ్మిది శాతం కార్పొరేట్ పన్ను విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు యూఏఈ కార్పొరేట్ పన్ను ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, మినహాయింపుకు అర్హత పొందేందుకు, ఈ సంస్థలు తప్పనిసరిగా కార్పొరేట్ పన్ను చట్టంలోని ఆర్టికల్ (9)లోని షరతులను తప్పక పాటించాలని, అవి అన్ని సంబంధిత సమాఖ్య, స్థానిక చట్టాలకు అనుగుణంగా కొనసాగాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









