పబ్లిక్, కమ్యూనిటీ సంక్షేమ సంస్థలకు గుడ్ న్యూస్
- April 24, 2023
యూఏఈ: ప్రజా, కమ్యూనిటీ సంక్షేమానికి దోహదపడే సంస్థలను కార్పొరేట్ పన్ను నుండి మినహాయించినట్లు యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది ఈ సంవత్సరం అమలులోకి వస్తుందని తెలిపింది. ప్రజా సంక్షేమం, దాతృత్వం, కమ్యూనిటీ సర్వీసెస్ లేదా కార్పొరేట్, సామాజిక బాధ్యతపై దృష్టి సారించిన కంపెనీలు కార్పొరేట్ పన్ను నుండి మినహాయించబడతాయని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. యూఏఈ గత సంవత్సరం Dh375,000 అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్న కంపెనీలు, ఫ్రీలాన్సర్లపై తొమ్మిది శాతం కార్పొరేట్ పన్ను విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు యూఏఈ కార్పొరేట్ పన్ను ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, మినహాయింపుకు అర్హత పొందేందుకు, ఈ సంస్థలు తప్పనిసరిగా కార్పొరేట్ పన్ను చట్టంలోని ఆర్టికల్ (9)లోని షరతులను తప్పక పాటించాలని, అవి అన్ని సంబంధిత సమాఖ్య, స్థానిక చట్టాలకు అనుగుణంగా కొనసాగాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









