ఈద్ అల్-ఫితర్ సెలవులు: పోటెత్తిన పర్యాటకులు.. పెరిగిన హోటల్ ఆక్యుపెన్సీ రేట్లు!
- April 24, 2023
దోహా: ఈద్ అల్-ఫితర్ సెలవుల్లో పర్యాటకులు ఖతార్ కు పోటెత్తారు. దీంతో ప్రపంచ పర్యాటక హాట్స్పాట్గా ఖతార్ మారింది. జనవరి 2023 నుండి దేశానికి వచ్చే సందర్శకుల సంఖ్య భారీగా పెరిగిందని పర్యాటక రంగ నిపుణుడు అలీ సబ్రీ తెలిపారు. ఈద్ అల్-ఫితర్ సెలవుదినాల సందర్భంగా హోటళ్లలో పర్యాటకులు, నివాసితుల సంఖ్య పెరిగిందన్నారు. హోటల్ ఆక్యుపెన్సీ రేటును 80 శాతానికి పెంచిందని పేర్కొన్నారు. హయ్యా ప్లాట్ఫారమ్ను కొత్త రూపంలో పునర్నిర్మించడం పర్యాటక రంగానికి బలమైన ప్రేరణనిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ఖతార్కు పర్యాటకుల ప్రవాహాన్ని తాజా చర్యలు పెంచుతాయని తెలిపారు.
హయ్యా ప్లాట్ఫారమ్ 4 వీసా రకాలను అందిస్తుంది: ఏదైనా జాతీయత కలిగిన వారికి టూరిస్ట్ వీసా, అన్ని వృత్తుల కోసం GCC రెసిడెంట్ వీసా, అలాగే GCC పౌరుల ఎస్కార్ట్ల కోసం వీసా, eTA అని పిలువబడే ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ వీసా. ఇది పరిమితులు లేకుండా అమెరికా, కెనడా, స్కెంజెన్ దేశాలు, బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల వీసా హోల్డర్లకు అందుబాటులో ఉంది. ఖతార్ను సందర్శించాలనుకునే వారు, ఇప్పుడు ఒకే ప్లాట్ఫారమ్ను ఉపయోగించి వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఖతార్ ఎయిర్వేస్ సహకారంతో ఖతార్ టూరిజం నిర్వహించిన ఈద్ ఇన్ ఖతార్ ప్రచారం కూడా పర్యాటకుల సంఖ్య పెరిగేందుకు ఒక కారణంగా ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. దోహాను అరబ్ మినిస్టీరియల్ కౌన్సిల్ ఫర్ టూరిజం 2023కి అరబ్ టూరిజం క్యాపిటల్గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







