ఈద్ అల్-ఫితర్ సెలవులు: పోటెత్తిన పర్యాటకులు.. పెరిగిన హోటల్ ఆక్యుపెన్సీ రేట్లు!
- April 24, 2023
దోహా: ఈద్ అల్-ఫితర్ సెలవుల్లో పర్యాటకులు ఖతార్ కు పోటెత్తారు. దీంతో ప్రపంచ పర్యాటక హాట్స్పాట్గా ఖతార్ మారింది. జనవరి 2023 నుండి దేశానికి వచ్చే సందర్శకుల సంఖ్య భారీగా పెరిగిందని పర్యాటక రంగ నిపుణుడు అలీ సబ్రీ తెలిపారు. ఈద్ అల్-ఫితర్ సెలవుదినాల సందర్భంగా హోటళ్లలో పర్యాటకులు, నివాసితుల సంఖ్య పెరిగిందన్నారు. హోటల్ ఆక్యుపెన్సీ రేటును 80 శాతానికి పెంచిందని పేర్కొన్నారు. హయ్యా ప్లాట్ఫారమ్ను కొత్త రూపంలో పునర్నిర్మించడం పర్యాటక రంగానికి బలమైన ప్రేరణనిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ఖతార్కు పర్యాటకుల ప్రవాహాన్ని తాజా చర్యలు పెంచుతాయని తెలిపారు.
హయ్యా ప్లాట్ఫారమ్ 4 వీసా రకాలను అందిస్తుంది: ఏదైనా జాతీయత కలిగిన వారికి టూరిస్ట్ వీసా, అన్ని వృత్తుల కోసం GCC రెసిడెంట్ వీసా, అలాగే GCC పౌరుల ఎస్కార్ట్ల కోసం వీసా, eTA అని పిలువబడే ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ వీసా. ఇది పరిమితులు లేకుండా అమెరికా, కెనడా, స్కెంజెన్ దేశాలు, బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల వీసా హోల్డర్లకు అందుబాటులో ఉంది. ఖతార్ను సందర్శించాలనుకునే వారు, ఇప్పుడు ఒకే ప్లాట్ఫారమ్ను ఉపయోగించి వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఖతార్ ఎయిర్వేస్ సహకారంతో ఖతార్ టూరిజం నిర్వహించిన ఈద్ ఇన్ ఖతార్ ప్రచారం కూడా పర్యాటకుల సంఖ్య పెరిగేందుకు ఒక కారణంగా ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. దోహాను అరబ్ మినిస్టీరియల్ కౌన్సిల్ ఫర్ టూరిజం 2023కి అరబ్ టూరిజం క్యాపిటల్గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









