అంతర్ రాష్ట్ర ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు రట్టు..
- April 25, 2023
హైదరాబాద్: అంతర్ రాష్ట్ర ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు రట్టు అయింది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరుకి చెందిన 13 మందిని సైబరాబాద్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం ఫేక్ కరెన్సీ ముఠాలపై ఫోకస్ పెట్టామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అంతర్ రాష్ట్ర ఫేక్ కరెన్సీ ముఠాను పట్టుకున్నామని చెప్పారు.
13 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. కిరాణం షాప్స్, పాన్ షాప్స్ లో ఫేక్ కరెన్సీనీ మారుస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్, చెన్నై, కర్ణాటక కేంద్రంగా ఫేక్ కరెన్సీ రాకెట్ నడుస్తుందన్నారు. 1:3 రేసియోలో ఫేక్ కరెన్సీ ఇస్తున్నారని చెప్పారు.
ఒక లక్ష ఒరిజినల్ నోట్స్ కు రూ.3 లక్షల ఫేక్ కరెన్సీ ఇస్తున్నారని వెల్లడించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచి ఈ ముఠాను పట్టుకున్నామని పేర్కొన్నారు. రాజేష్, నిలేష్ అనే ప్రధాన నిందితులు సాయత్రం, రాత్రి వేళల్లో ఫేక్ నోట్స్ అమాయకుల దగ్గర సర్క్యులేట్ చేస్తున్నారని తెలిపారు.
నిందితుల నుంచి రూ.30 లక్షల 68వేల 500 ఫేక్ నోట్స్, క్యాష్ 60వేల 500వందల నగదు, 13 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఫేక్ నోట్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐదు రకాల తేడాలతో ఫేక్ నోట్స్ ను గుర్తించవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సరికొత్త రికార్డు
- తెలంగాణలో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్
- కేరళంలో షిగెల్లా వ్యాధి..
- నంది అవార్డుల పునరుద్ధరణపై మంత్రి కీలక ప్రకటన
- ఈద్ డ్రా..విజేతల నంబర్లను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- హవల్లీ, ఫర్వానియాల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- ప్రాంతీయ భద్రత పై బహ్రెయిన్-ఈజిప్ట్ చర్చలు..!!
- దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- iPhoneలను వెంటనే అప్డేట్ చేసుకోవాలన్న ఖతార్ NCSA..!!
- మిడిలీస్టులోనే అతిపెద్ద వాటర్ పార్క్ కిద్దియాలో సాఫ్ట్ లాంచ్..!!









