తెలంగాణ కొత్త సచివాలయంలో శాఖలకు సంబంధించిన ఫ్లోర్లు కేటాయింపు
- April 25, 2023
హైదరాబాద్: ఈ నెల 30వ తేదీన సమీకృత కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రేపటి (26వ తేదీ) నుంచి సమీకృత కొత్త సచివాలయానికి శాఖల షిఫ్టింగ్ షురూ కానుంది. ఈ నెల 28వ తేదీ వరకు అంటే మూడు రోజుల్లో మొత్తం శాఖలన్నీ షిఫ్ట్ అయిపోవాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు. ఇక ఒక్కో ఫ్లోర్ కు మూడు శాఖల చొప్పున కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో రెవెన్యూశాఖ, మొదటి ఫ్లోర్లో హోమ్ శాఖ, రెండో అంతస్తులో ఆర్థిక శాఖ ఉండబోతున్నాయి.
మూడో ఫ్లోర్లో అగ్రికల్చర్ & ఎస్సీ డెవలప్మెంట్ శాఖలకు కేటాయించారు. నాలుగవ అంతస్తులో ఇరిగేషన్ అండ్ లా, ఐదవ అంతస్తులో సాధారణ పరిపాలన శాఖ, ఆరో ఫ్లోర్ లో సీఎం, సీఎస్ లకు కేటాయింపులు చేశారు. ఈ మేరకు శాఖల వారిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే సచివాలయం ప్రారంభం రోజు ఉదయం కొత్త సచివాలయం ప్రాంగణంలో సుదర్శన యాగం చేయనున్నట్టు సమాచారం. దీనికిగాను అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- ప్రధాని మోదీ సరికొత్త రికార్డు
- తెలంగాణలో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్
- కేరళంలో షిగెల్లా వ్యాధి..









