పీఎఫ్ చందాదారులకు కొత్త స్కీమ్!
- May 09, 2016
కేంద్రం కసరత్తు లోక్సభలో బండారు దత్తాత్రేయ ప్రకటన న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ సంస్థ- ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) చందాదారులకు తక్కువ ధరకు గృహ సౌలభ్యం కల్పించేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ లోక్సభలో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈపీఎఫ్ఓలో దాదాపు ఐదు కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ప్రస్తుతం ఈ అంశం చర్చల స్థాయిలోనే ఉందని మంత్రి తెలియజేశారు. 'తక్కువ ధర ఇండ్ల కొనుగోలుకు ఒక ఉద్యోగి తమ భవిష్య పీఎఫ్ హామీ' సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. నిజానికి ఈ అంశం గత ఏడాది సెప్టెంబర్ 16 ఈపీఎఫ్ఓల ట్రస్టీల సమావేశంలో చర్చకు వచ్చినట్లు మంత్రి తెలిపారు.
దీనిపై ఏర్పాటయిన ఒక నిపుణుల కమిటీ తన నివేదికను ట్రస్టీలకు సైతం సమర్పించిందన్నారు. కమిటీ నివేదిక పథక రూపకల్పనకు సానుకూలంగానే స్పందించిందనీ పేర్కొన్నారు. ప్రతిపాదిత పథకం ప్రకారం- పీఎఫ్ సభ్యుడు, బ్యాంక్ (లేదా హౌసింగ్ ఏజెన్సీ), ఈపీఎఫ్ఓల మధ్య 'భవిష్య పీఎఫ్ ఈఎంఐ పేమెంట్లకు' సంబంధించి ఒక అవగాహన ఏర్పడాల్సి ఉంటుందన్నారు. గృహ, పట్టణ పేదరిక నిర్మూలనా మంత్రిత్వశాఖ నుంచి లభించే ప్రయోజనాలు సైతం లబ్ధిదారులకు లభించేలా పథకం రూపొందించాలని నిపుణుల కమిటీ సూచించిందన్నారు.
నిర్వహణలోలేని అకౌంట్లలో రూ.43,000 కోట్లు ఇదిలావుండగా, ఈపీఎఫ్ఓకు సంబంధించి నిర్వహణలోలేని ఎకౌంట్లలో రూ.43,000 కోట్లు ఉన్నట్లు మంత్రి సభకు తెలిపారు. వస్తున్న వడ్డీసైతం ఆయా అకౌంట్లలోనే జమ చేస్తున్నట్లు వెల్లడించారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో 1.18 కోట్ల క్లెయిమ్స్ పరిష్కరించినట్లు చెప్పిన మంత్రి, వీటిలో 98 శాతం 20 రోజలు వ్యవధిలోనే పూర్తయినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







