షిర్డీ సాయి భక్తులకు శుభవార్త.. ఆంక్షలు ఎత్తివేత
- April 28, 2023
షిర్డీ: షిర్డీ సాయి భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు, భక్తులు నేరుగా బాబాకు పూల మాలలు...ప్రసాదాలు సమర్పించడంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు కరోనా వ్యాప్తి నేపథ్యంలో షిర్డీ ఆలయంలో భక్తులు నేరుగా పూలు, దండలు, ప్రసాదాలు సమర్పించడంపై నిషేధం విధించారు. తాజాగా కరోనా వ్యాప్తి తగ్గడంతో భక్తులపై షిర్డీ సాయి సంస్థాన్ ట్రస్ట్ ఆంక్షలను సడలించింది. గత రెండు సంవత్సరాలుగా ఈ నిషేధం వల్ల తమకు భారీగా నష్టం వాటిల్లిందని షిర్డీ సమీపంలో పూల సాగు చేస్తున్న రైతులు తెలిపారు. దాదాపు 400 ఎకరాల్లో పూల సాగు జరుగుతోందని వారు తెలిపారు. ఆంక్షలను తొలగించాలని కొన్ని నెలల క్రితం పూల రైతులు, వ్యాపారులు నిరసనకు దిగారు. దీంతో మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ఈ అంశంపై అధ్యయనం చేయడానికి అప్పటి జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వైద్యాధికారులు, వ్యాపారులతో పాటు భక్తుల నుంచి కమిటీ సమాచారం సేకరించింది. ఆలయ నిర్వాహకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. దీంతో గతంలో విధించిన ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. కమిటీ సూచనల మేరకు మళ్లీ పాత పద్ధతిలోనే భక్తుల నుంచి పూలమాలలు, ప్రసాదాలు స్వీకరిస్తామని షిర్డీ సంస్థాన్ ప్రకటించింది. దీంతో భక్తులు స్వయంగా బాబాకు పూలు సమర్పించుకునే సౌలభ్యం ఏర్పడింది.
తాజా వార్తలు
- ఎడిసన్లో 'NATS'-సాయి దత్త పీఠం ఉచిత వైద్య శిబిరం ప్రవాసుల నుండి విశేష స్పందన
- ఏపీకి దక్కిన అరుదైన గౌరవం
- ఆంధ్ర భవన్లో ఘనంగా నిర్వహించిన ఆత్మ గౌరవ దివస్–2026
- IPL 2026: ఫైనల్లో గుజరాత్ 155 రన్స్..ఆర్సీబీ కొట్టాల్సింది 156
- వైజాగ్లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్
- 6,500 మంది అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ మెగా వీడియో కాన్ఫరెన్స్
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్కు విశిష్ట గుర్తింపు
- గూగుల్కు రూ.30 లక్షల జరిమానా..హైకోర్టు కీలక తీర్పు









