గన్నవరం విమానాశ్రయంలో రజనీకాంత్ కు ఘనస్వాగతం పలికిన బాలకృష్ణ
- April 28, 2023
విజయవాడ: టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు నేడు విజయవాడలోని పోరంకిలో జరగబోతున్నాయి. ఈ ఉత్సవాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిధిగా హాజరుకాబోతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయనకు నందమూరి బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు.
బాలకృష్ణ ను చూడగానే ఆత్మీయ ఆలింగనం చేసుకున్న రజనీకాంత్…ఎలా ఉన్నారంటూ పరస్పరం పలకరించుకున్నారు. ఒకే కారులో నోవోటెల్ కు వెళ్లిన రజనీకాంత్ – బాలయ్య… ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు వచ్చినందుకు రజనీకాంత్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి రజనీకాంత్ రానున్నారు. తేనేటి విందు అనంతరం అక్కడి నుంచి రజినీకాంత్, నందమూరి బాలకృష్ణ , చంద్రబాబు కుటుంబసభ్యులు.. అందరూ కలిసి సాయంత్రం ఐదు గంటలకు ఉండవల్లి నివాసం నుంచి పోరంకి అనుమోలు గార్డెన్స్లో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సభ వద్దకు వెళ్ళనున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







