యూఏఈ-భారత ఆర్థిక సంబంధాలలో కొత్త చైతన్యం
- April 30, 2023
యూఏఈ: గత ఏడాది మే 1 నుంచి అమల్లోకి వచ్చిన యూఏఈ -ఇండియా సెపా భాగస్వామ్యంలో కొత్త చైతన్యాన్ని నింపిందని యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ అన్నారు. ఈ ఒప్పందం కేవలం వాణిజ్యానికి సంబంధించినది కాదని, ఇది రెండు దేశాల మధ్య ఆర్థిక పురోగతికి చేయూతనిస్తుందన్నారు. ఇప్పుడు ఒప్పందం ప్రకారం వ్యాపారం, ప్రజల మధ్య సంబంధాలు పుంజుకుంటున్నందున పెట్టుబడులు, సేవలు, మానవ వనరులు, స్టార్టప్లపై దృష్టి మళ్లిందని ఆయన చెప్పారు. ఒప్పందం వల్ల భారతీయ ఎగుమతులు త్వరలో 31 బిలియన్ డాలర్లు దాటుతాయని అంచనా. రత్నాలు, ఆభరణాలు, శుద్ధి చేసిన ఖనిజాలు, ఆహారం, వ్యవసాయం, FMCG రంగం ఎగుమతుల వైపు నుండి అత్యధికంగా లాభపడిన రంగాలుగా ఉన్నాయని తెలిపారు.
యూఏఈ ఆహార భద్రతకు భారత్ అండగా ఉంటుందన్నారు. అదే సమయంలో ఆహార భద్రత విషయంలో యూఏఈ భారతదేశంలో $2 బిలియన్ల పెట్టుబడితో ఫుడ్ పార్కుల కోసం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. రెండు దేశాల మధ్య విమానయాన రంగంలో మరిన్ని అవకాశాలు ఉన్నాయి. యూఏఈలో పరిమిత సంఖ్యలో ఎయిర్ పోర్టులు ఉండగా.. భారత్ లో పరిస్థి భిన్నంగా ఉంది. రాబోయే రోజుల్లో యూఏఈ-భారత్ మార్గతంలో మరిన్ని సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- లోక్ భవన్లో ఘనంగా గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- 12 మిలియన్ దిర్హమ్ విలువైన విలాసవంతమైన ఊద్ దొంగతనం..12 గంటల్లో ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీస్
- కోర్టుల చుట్టూ తిరగలేకే మొయిజుద్దీన్ హత్య..ఏడుగురు అరెస్ట్
- జూన్ 1 నుంచి మారనున్న కీలక ఆర్థిక నిబంధనలు ఇవే!
- పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానం చేసిన సీపీ సుమతి
- అమెరికాలో తెలుగమ్మాయికి ప్రతిష్టాత్మక పురస్కారం
- తెలంగాణలో నిప్పుల కొలిమి: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
- ఒమన్ తీవ్రమైన వేడి.. 48°Cకు ఉష్ణోగ్రతలు..!!
- క్యజో రి శిఖరాన్ని అధిరోహించిన యువ బహ్రెయిన్ సాహసికుడు..!!
- అల్ జౌర్ బీచ్లో షార్క్ దాడిలో 11 ఏళ్ల బాలికకు గాయాలు..!!









