యూఏఈ-భారత ఆర్థిక సంబంధాలలో కొత్త చైతన్యం
- April 30, 2023
యూఏఈ: గత ఏడాది మే 1 నుంచి అమల్లోకి వచ్చిన యూఏఈ -ఇండియా సెపా భాగస్వామ్యంలో కొత్త చైతన్యాన్ని నింపిందని యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ అన్నారు. ఈ ఒప్పందం కేవలం వాణిజ్యానికి సంబంధించినది కాదని, ఇది రెండు దేశాల మధ్య ఆర్థిక పురోగతికి చేయూతనిస్తుందన్నారు. ఇప్పుడు ఒప్పందం ప్రకారం వ్యాపారం, ప్రజల మధ్య సంబంధాలు పుంజుకుంటున్నందున పెట్టుబడులు, సేవలు, మానవ వనరులు, స్టార్టప్లపై దృష్టి మళ్లిందని ఆయన చెప్పారు. ఒప్పందం వల్ల భారతీయ ఎగుమతులు త్వరలో 31 బిలియన్ డాలర్లు దాటుతాయని అంచనా. రత్నాలు, ఆభరణాలు, శుద్ధి చేసిన ఖనిజాలు, ఆహారం, వ్యవసాయం, FMCG రంగం ఎగుమతుల వైపు నుండి అత్యధికంగా లాభపడిన రంగాలుగా ఉన్నాయని తెలిపారు.
యూఏఈ ఆహార భద్రతకు భారత్ అండగా ఉంటుందన్నారు. అదే సమయంలో ఆహార భద్రత విషయంలో యూఏఈ భారతదేశంలో $2 బిలియన్ల పెట్టుబడితో ఫుడ్ పార్కుల కోసం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. రెండు దేశాల మధ్య విమానయాన రంగంలో మరిన్ని అవకాశాలు ఉన్నాయి. యూఏఈలో పరిమిత సంఖ్యలో ఎయిర్ పోర్టులు ఉండగా.. భారత్ లో పరిస్థి భిన్నంగా ఉంది. రాబోయే రోజుల్లో యూఏఈ-భారత్ మార్గతంలో మరిన్ని సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







