మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ లో ప్రధాని మోడీ ప్రసంగం
- April 30, 2023
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఆదివారం మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్లో ప్రసంగించారు. ఈ కార్యక్రమం వల్ల ప్రజల్లోని భావోద్వేగాలు తెలసుకునే అవకాశం కలిగిందని ప్రధాని మోడీ అన్నారు. మన్కీ బాత్ మొదటిసారి 2014, అక్టోబర్ 3న ప్రారంభమైందని, 'మన్కీ బాత్' కోట్లాది మంది ప్రజల 'మన్ కీ బాత్' కి ప్రతిబింబమని అన్నారు. ఈ కార్యక్రమానికి భారీ విజయాన్ని అందించనందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రధాని మోడీ ప్రారంభ ప్రసంగంలో పేర్కొన్నారు. 'హర్ ఘర్ తిరంగా' వంటి అనేక ప్రజా ఉద్యమాలను ఊపందుకునేలా చేసిందని అన్నారు. ఆత్మ నిర్భర భారత్ను ప్రోత్సహించడంతో పాటు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలతో పాటు విభిన్న రంగాల్లో ప్రతిభావంతులైన వ్యక్తుల కథలను అందరికీ అందించిందని అన్నారు. ఇది ప్రజలతో కనెక్ట్ అయ్యేలా చేసిందని, ఇది ఓ కార్యక్రమం కాదని, ఆధ్యాత్మిక ప్రయాణమని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చర్చించామని, సమాజంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రసారమయ్యేలా బిజెపి పాలిత రాష్ట్రాలు భారీ ఏర్పాట్లు చేశాయి. పార్టీ కార్యాలయాలు, బూత్లలో ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.
తాజా వార్తలు
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!









