మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ లో ప్రధాని మోడీ ప్రసంగం
- April 30, 2023
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఆదివారం మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్లో ప్రసంగించారు. ఈ కార్యక్రమం వల్ల ప్రజల్లోని భావోద్వేగాలు తెలసుకునే అవకాశం కలిగిందని ప్రధాని మోడీ అన్నారు. మన్కీ బాత్ మొదటిసారి 2014, అక్టోబర్ 3న ప్రారంభమైందని, 'మన్కీ బాత్' కోట్లాది మంది ప్రజల 'మన్ కీ బాత్' కి ప్రతిబింబమని అన్నారు. ఈ కార్యక్రమానికి భారీ విజయాన్ని అందించనందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రధాని మోడీ ప్రారంభ ప్రసంగంలో పేర్కొన్నారు. 'హర్ ఘర్ తిరంగా' వంటి అనేక ప్రజా ఉద్యమాలను ఊపందుకునేలా చేసిందని అన్నారు. ఆత్మ నిర్భర భారత్ను ప్రోత్సహించడంతో పాటు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలతో పాటు విభిన్న రంగాల్లో ప్రతిభావంతులైన వ్యక్తుల కథలను అందరికీ అందించిందని అన్నారు. ఇది ప్రజలతో కనెక్ట్ అయ్యేలా చేసిందని, ఇది ఓ కార్యక్రమం కాదని, ఆధ్యాత్మిక ప్రయాణమని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చర్చించామని, సమాజంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రసారమయ్యేలా బిజెపి పాలిత రాష్ట్రాలు భారీ ఏర్పాట్లు చేశాయి. పార్టీ కార్యాలయాలు, బూత్లలో ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







