మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ లో ప్రధాని మోడీ ప్రసంగం
- April 30, 2023
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఆదివారం మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్లో ప్రసంగించారు. ఈ కార్యక్రమం వల్ల ప్రజల్లోని భావోద్వేగాలు తెలసుకునే అవకాశం కలిగిందని ప్రధాని మోడీ అన్నారు. మన్కీ బాత్ మొదటిసారి 2014, అక్టోబర్ 3న ప్రారంభమైందని, 'మన్కీ బాత్' కోట్లాది మంది ప్రజల 'మన్ కీ బాత్' కి ప్రతిబింబమని అన్నారు. ఈ కార్యక్రమానికి భారీ విజయాన్ని అందించనందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రధాని మోడీ ప్రారంభ ప్రసంగంలో పేర్కొన్నారు. 'హర్ ఘర్ తిరంగా' వంటి అనేక ప్రజా ఉద్యమాలను ఊపందుకునేలా చేసిందని అన్నారు. ఆత్మ నిర్భర భారత్ను ప్రోత్సహించడంతో పాటు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలతో పాటు విభిన్న రంగాల్లో ప్రతిభావంతులైన వ్యక్తుల కథలను అందరికీ అందించిందని అన్నారు. ఇది ప్రజలతో కనెక్ట్ అయ్యేలా చేసిందని, ఇది ఓ కార్యక్రమం కాదని, ఆధ్యాత్మిక ప్రయాణమని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చర్చించామని, సమాజంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రసారమయ్యేలా బిజెపి పాలిత రాష్ట్రాలు భారీ ఏర్పాట్లు చేశాయి. పార్టీ కార్యాలయాలు, బూత్లలో ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.
తాజా వార్తలు
- లోక్ భవన్లో ఘనంగా గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- 12 మిలియన్ దిర్హమ్ విలువైన విలాసవంతమైన ఊద్ దొంగతనం..12 గంటల్లో ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీస్
- కోర్టుల చుట్టూ తిరగలేకే మొయిజుద్దీన్ హత్య..ఏడుగురు అరెస్ట్
- జూన్ 1 నుంచి మారనున్న కీలక ఆర్థిక నిబంధనలు ఇవే!
- పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానం చేసిన సీపీ సుమతి
- అమెరికాలో తెలుగమ్మాయికి ప్రతిష్టాత్మక పురస్కారం
- తెలంగాణలో నిప్పుల కొలిమి: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
- ఒమన్ తీవ్రమైన వేడి.. 48°Cకు ఉష్ణోగ్రతలు..!!
- క్యజో రి శిఖరాన్ని అధిరోహించిన యువ బహ్రెయిన్ సాహసికుడు..!!
- అల్ జౌర్ బీచ్లో షార్క్ దాడిలో 11 ఏళ్ల బాలికకు గాయాలు..!!









