అల్ ఖుసైస్లో కొత్త రహదారి ప్రాజెక్ట్.. తగ్గనున్న 60% ప్రయాణ సమయం..!
- May 01, 2023
దుబాయ్: అల్ ఖుసైస్లోని ఐదు ప్రాంతాలలో ప్రయాణ సమయాన్ని 60 శాతం వరకు తగ్గించే కొత్త రహదారి ప్రాజెక్ట్ ను ఆదివారం ప్రకటించారు. అల్ ఖుసైస్ ఇండస్ట్రియల్ ఏరియాలు 1, 2, 3, 4 మరియు 5లో అంతర్గత రోడ్లు, లైటింగ్ పనుల కోసం ఒక కాంట్రాక్టును దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో 10 కిలోమీటర్ల మేర 32 రోడ్లు 43 కిలోమీటర్ల వీధిలైట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇది రెండు దిశలలో గంటకు 500 నుండి 1,500 వాహనాల వరకు వెళ్లేలా.. రహదారిని 200 శాతం మేర విస్తరించనున్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలోని 60 వేల మందికి ఉపయోగపడుతుందని RTA డైరెక్టర్-జనరల్, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఛైర్మన్ మత్తర్ అల్ టేయర్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ను ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర సీఎం చంద్రబాబు
- హైదరాబాద్ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త
- టీమిండియా ఐర్లాండ్ పర్యటన ఖరారు..షెడ్యూల్ ఇదే!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు..
- యుద్ధం ముగిసేందుకు అమెరికా మిత్రదేశాలు సహాయపడాలి: సయ్యద్ బదర్
- అమెరికాకు శ్రీలంక బిగ్ షాక్
- ఇరాన్ దాడుల పై జీసీసీ మానవ హక్కుల సంస్థల అత్యవసర సమావేశం..!!
- హోర్ముజ్ జలసంధి పై పలు దేశాల సంయుక్త ప్రకటన..!
- 118 మంది బిచ్చగాళ్లను అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- కువైట్ గోల్డ్ మార్కెట్లో తగ్గిన ఈద్ సందడి ..!!









