యూఏఈ ప్రెసిడెంట్ కప్ విజేతకు భారీ నగదు బహుమతి ప్రకటించిన షార్జా రూలర్
- May 01, 2023
యూఏఈ: యూఏఈ ప్రెసిడెంట్స్ కప్తో కిరీటాన్ని కైవసం చేసుకున్న షార్జా ఫుట్బాల్ క్లబ్ జట్టును ఆదివారం అల్ బాడీ ప్యాలెస్లో సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి అభినందించారు. ఈ సందర్భంగా Dh10 మిలియన్ల బహుమతిని అందించారు. షార్జా క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ పాలకుడు షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి, షార్జా డిప్యూటీ పాలకుడు షేక్ సుల్తాన్ బిన్ అహ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూఏఈ ప్రెసిడెంట్స్ కప్ను క్లబ్ చరిత్రలో పదోసారి, వరుసగా రెండోసారి షార్జా ఫుట్బాల్ క్లబ్ జట్టు గెలుచుకున్నది. టోర్నీని విజయవంతంగా నిర్వహించినందుకు యూఏఈ ఫుట్బాల్ అసోసియేషన్ (UAEFA) అధ్యక్షుడు షేక్ రషీద్ బిన్ హుమైద్ అల్ నుయిమిను అ సందర్భంగా వారు అభినందించారు. యూఏఈ ప్రెసిడెంట్ కప్ను గెలుచుకున్న షార్జా జట్టును, మేనేజ్మెంట్, కోచ్లను డాక్టర్ షేక్ సుల్తాన్ అభినందించారు. అబుధాబిలోని మొహమ్మద్ బిన్ జాయెద్ స్టేడియంలో గత శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో షార్జా ఫుట్బాల్ క్లబ్ జట్టు అల్ ఐన్ క్లబ్పై పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించి యూఏఈ ప్రెసిడెంట్స్ కప్ టైటిల్ను సాధించింది.
తాజా వార్తలు
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత
- SATA జెద్దా–ఉగాది & ఈద్ వేడుకలు ఘనంగా నిర్వహణ
- శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర సీఎం చంద్రబాబు
- హైదరాబాద్ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త
- టీమిండియా ఐర్లాండ్ పర్యటన ఖరారు..షెడ్యూల్ ఇదే!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు..









