యూఏఈ ప్రెసిడెంట్ కప్ విజేతకు భారీ నగదు బహుమతి ప్రకటించిన షార్జా రూలర్
- May 01, 2023
యూఏఈ: యూఏఈ ప్రెసిడెంట్స్ కప్తో కిరీటాన్ని కైవసం చేసుకున్న షార్జా ఫుట్బాల్ క్లబ్ జట్టును ఆదివారం అల్ బాడీ ప్యాలెస్లో సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి అభినందించారు. ఈ సందర్భంగా Dh10 మిలియన్ల బహుమతిని అందించారు. షార్జా క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ పాలకుడు షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి, షార్జా డిప్యూటీ పాలకుడు షేక్ సుల్తాన్ బిన్ అహ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూఏఈ ప్రెసిడెంట్స్ కప్ను క్లబ్ చరిత్రలో పదోసారి, వరుసగా రెండోసారి షార్జా ఫుట్బాల్ క్లబ్ జట్టు గెలుచుకున్నది. టోర్నీని విజయవంతంగా నిర్వహించినందుకు యూఏఈ ఫుట్బాల్ అసోసియేషన్ (UAEFA) అధ్యక్షుడు షేక్ రషీద్ బిన్ హుమైద్ అల్ నుయిమిను అ సందర్భంగా వారు అభినందించారు. యూఏఈ ప్రెసిడెంట్ కప్ను గెలుచుకున్న షార్జా జట్టును, మేనేజ్మెంట్, కోచ్లను డాక్టర్ షేక్ సుల్తాన్ అభినందించారు. అబుధాబిలోని మొహమ్మద్ బిన్ జాయెద్ స్టేడియంలో గత శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో షార్జా ఫుట్బాల్ క్లబ్ జట్టు అల్ ఐన్ క్లబ్పై పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించి యూఏఈ ప్రెసిడెంట్స్ కప్ టైటిల్ను సాధించింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







