15 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు
- May 04, 2023
యూఏఈ: అబుధాబిలో ఉండే భారతీయ ప్రవాసుడు ప్రదీప్ కుమార్.. బిగ్ టికెట్ ర్యాఫిల్ డ్రా సిరీస్ 251లో 15 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్నాడు. ఏప్రిల్ 13న విజేతగా నిలిపిన టిక్కెట్ నంబర్ 048514ను కొనుగోలు చేశాడు. బహుమతి సమాచారం దక్షిణ భారత నగరమైన చెన్నైలోని విమానాశ్రయంలో ఉన్న సమయంలో నిర్వాహకులు తెలపడంతో ప్రదీప్ సంతోషం వ్యక్తం చేశాడు. త్వరలోనే అబుధాబి వస్తున్నానని, ప్రైజ్ మనీని మరో ఇద్దరు స్నేహితులతో పంచుకోనున్నట్లు కుమార్ తెలిపారు. ప్రత్యేకంగా, బిగ్ టికెట్ ఈ నెలలో 100 మంది అదృష్ట విజేతలకు 100 బహుమతులు అందజేస్తోంది. జూన్ 3న జరగనున్న ర్యాఫిల్ డ్రా సిరీస్ 252కి 20 మిలియన్ దిర్హాంల భారీ బహుమతి లభిస్తుంది. మే 31 వరకు బిగ్ టికెట్ వెబ్సైట్ http://www.bigticket.ae ద్వారా ఆన్లైన్లో టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు లేదా అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం, అల్ ఐన్ విమానాశ్రయంలోని స్టోర్ కౌంటర్లను సందర్శించడం ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







