దేశంలో బిఆర్ఎస్ తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది: తోట చంద్రశేఖర్
- May 05, 2023అమరావతి: ఏపిలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తామని బిఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. తెలంగాణ మోడల్ దేశమంతా విస్తరించాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ దేశంలో తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని అన్నారు. ఢిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయాన్ని రికార్డు సమయంలో నిర్మించారని అన్నారు. దేశ చరిత్రను తిరగరాసే అనేక సందర్భాలకు బిఆర్ఎస్ కార్యాలయం వేదిక కావాలని ఆకాంక్షించారు.
దేశ ప్రజల మధ్య బిజెపి మత విద్వేషాలను సృష్టిస్తోందని తోట చంద్రశేఖర్ విమర్శించారు. బిజెపిని ఎదుర్కోవడంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ పూర్తిగా విఫలమయిందని అన్నారు. బిజెపికి వ్యతిరేకంగా పోరాడగలిగే సత్తా, ధైర్యం కేవలం కెసిఆర్ కు మాత్రమే వున్నాయని చెప్పారు. ఏపీలో బిఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందన్నారు.
తాజా వార్తలు
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు