సౌదీ నుంచి కువైట్ వెళ్తుండగా కారు ప్రమాదం..భారతీయుడు మృతి
- May 06, 2023
కువైట్: భారత జాతీయుడు లాజి ఎం. చెరియన్ తన కారులో సౌదీ అరేబియా నుండి కువైట్ వెళ్తుండగా.. జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అతను తన ఉద్యోగ రిత్యా సౌదీలో ఉంటారు. తన ఫ్యామిలీని చూసేందుకు కువైట్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లాజి M. చెరియన్ ఎన్బీటీసీ(NBTC) కంపెనీ జనరల్ డిపార్ట్మెంట్లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. సౌదీ ప్రాజెక్ట్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు. కేరళలోని తిరువల్లకు చెందిన మిస్టర్ లాజి ఎం. చెరియన్ కు భార్య అనితా చెరియన్, పిల్లలు జోన్ అచు చెరియన్, జెస్లిన్ ఎల్సా చెరియన్, జేడెన్ అన్నా చెరియన్లు ఉన్నారు. అతను సెయింట్ థామస్ ఎవాంజెలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా కువైట్ పారిష్లో క్రియాశీల సభ్యుడుగా ఉన్నారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









