సౌదీ నుంచి కువైట్ వెళ్తుండగా కారు ప్రమాదం..భారతీయుడు మృతి
- May 06, 2023
కువైట్: భారత జాతీయుడు లాజి ఎం. చెరియన్ తన కారులో సౌదీ అరేబియా నుండి కువైట్ వెళ్తుండగా.. జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అతను తన ఉద్యోగ రిత్యా సౌదీలో ఉంటారు. తన ఫ్యామిలీని చూసేందుకు కువైట్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లాజి M. చెరియన్ ఎన్బీటీసీ(NBTC) కంపెనీ జనరల్ డిపార్ట్మెంట్లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. సౌదీ ప్రాజెక్ట్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు. కేరళలోని తిరువల్లకు చెందిన మిస్టర్ లాజి ఎం. చెరియన్ కు భార్య అనితా చెరియన్, పిల్లలు జోన్ అచు చెరియన్, జెస్లిన్ ఎల్సా చెరియన్, జేడెన్ అన్నా చెరియన్లు ఉన్నారు. అతను సెయింట్ థామస్ ఎవాంజెలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా కువైట్ పారిష్లో క్రియాశీల సభ్యుడుగా ఉన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







