కాంగోలో వరద బీభత్సం.. 176 మంది మృతి
- May 07, 2023
కాంగో: ఆఫ్రికాలోని కాంగోలో వరద బీభత్సం సృష్టించింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు దక్షిణ కివు ప్రావిన్స్ లో నదులకు వరద నీరు పోటెత్తింది. దీంతో ఊర్లకు ఊర్లే వరద నీటిలో కొట్టుకుపోయాయి. వరదల ధాటికి 176 మంది మరణించారు.
మరో 200 మందికి పైగా వరదల్లో గల్లంతయ్యారు. కాగా, ఇళ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు వరద నీటిలో కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఉండటానికి ఇళ్లు లేక ప్రజలు నిరాశ్రయులయ్యారని వెల్లడించారు. నిలువ నీడలేకపోవడంతో ఆరుబయటే ఉంటున్నారని తెలిపారు.
దక్షిణ కివులో వరదలు, కొండచరియలు విరిగి పడటం సర్వ సాధారణమని అధికారులు పేర్కొన్నారు.
2014లో కూడా ఇలాంటి ప్రకృతి విపత్తే సంభవించిందని గుర్తు చేశారు. భారీ వర్షాలకు ఏడు వందలకు పైగా ఇళ్లు తుడిచిపెట్టుకు పోయాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది.
130 మందికి పైగా గల్లంతయ్యారని ఐరాస పేర్కొంది. గత నెల ఏప్రిల్ లో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 21 మంది మరణించారు. కిన్ షాసాలో డిసెంబర్ కురిసిన భారీ వర్షాలతో 169 మంది చెందారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









