ఒమన్లో వేర్వేరు ఘటనల్లో పది రోజుల్లో ఎనిమిది మంది మృతి
- May 07, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో పది రోజుల్లో వేర్వేరు సంఘటనల్లో ఎనిమిది మంది మరణించారు. నీటిలో మునిగిపోవడం, ఇసుక కుప్పకూలడం, గ్యాస్ లీకేజీల కారణంగా మరణాలు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 26 నుండి మే 6 వరకు అధికారికంగా లేదా సోషల్ మీడియా ద్వారా ప్రకటించబడిన అనేక దురదృష్టకర ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా పని ప్రదేశాలలో, రోడ్లపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా వర్షం సమయంలో ప్రజలు, నివాసితులు జాగ్రత్తగా ఉండాలని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) పిలుపునిచ్చింది.
దంపతులు మృతి
అల్ షర్కియా సౌత్ గవర్నరేట్లోని జాలాన్ బనీ బు అలీ లోయలో వాహనం కూరుకుపోయిన ఘటనలో భార్య, ఆమె భర్త చనిపోయారు.
నీటమునిగి యువకుడు మృతి
21 సంవత్సరాల వయస్సు గల మొహమ్మద్ డి అల్-రహ్బీ తప్పిపోయిన మూడు రోజుల తర్వాత దిమా వాల్'తైయిన్ విలాయత్లోని వాడి దయఖాలో అతని మృతదేహాన్ని సీడీఏఏ బృందాలు గుర్తించాయి. ఏప్రిల్ 29న ఉదయం 11 గంటలకు దిమా వాల్'తైయిన్ విలాయత్ ప్రాంతంలోని (టౌల్) పర్వతాలలో స్నేహితులతో నడుచుకుంటూ.. వాడి దయఖా ఆనకట్ట వైపు వెళుతున్న క్రమంలో లోయ ప్రవాహంలో అతని కాలు జారి వరదలో కొట్టుకుపోయాడు.
గ్యాస్ లీక్ వల్ల..యువకుడు మృతి
అల్-వుస్తా గవర్నరేట్లోని ముఖైజ్నా ఫీల్డ్లో హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ లీకేజీ ప్రమాదం కారణంగా యాహ్యా అల్-అన్బౌరీ అనే వ్యక్తి మరణించాడు. లీకేజీ వల్ల మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ మేరకు ఆయిల్ అండ్ గ్యాస్ వర్కర్స్ యూనియన్ ట్వీట్ చేసింది.
కొండచరియలు విరిగి.. నలుగురు మృతి
నఖల్లోని విలాయత్లోని వాకాన్ గ్రామానికి వెళ్లే రహదారిపై ఒక కంపెనీ నిర్వహణ పనులు చేస్తుండగా ముగ్గురు కార్మికులపై ఇసుక కూలడంతో మరణించారు. మృతులను బంగ్లాదేశ్ జాతీయులుగా గుర్తించారు.
నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లో బిడియాలోని విలాయత్లోని అల్ ముంట్రెబ్లోని ఒక పొలంలో బావిని తవ్వుతుండగా.. ఇసుక కూలి ఆసియా జాతీయతకు చెందిన ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. అందులో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







