ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఎమిరాటీలు మృతి

- May 07, 2023 , by Maagulf
ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఎమిరాటీలు మృతి

యూఏఈ: రాంగ్ ఓవర్‌టేకింగ్ కారణంగా ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఫుజైరాలోని దిబ్బా-మసాఫీ వీధితో మసాఫీ ప్రాంతాన్ని కలిపే రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఎమిరాటీలు( 19 ఏళ్ల పురుషుడు, 28 ఏళ్ల మహిళ) మరణించారు. ఫుజైరా పోలీస్‌లోని ట్రాఫిక్, పెట్రోల్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ సలేహ్ మహమ్మద్ అబ్దుల్లా అల్ ధన్హానీ ప్రకారం.. మసాఫీ రౌండ్‌అబౌట్ సమీపంలో ఒక కారును తప్పించే క్రమంలో ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చే మరో వాహనాన్ని ఢీకొట్టింది. అల్ ధన్హానీ పోలీసు ట్రాఫిక్ పెట్రోలింగ్, అంబులెన్స్‌ బృందాలు సంఘటన ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేయడానికి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com