కొకైన్ స్మగ్లింగ్, విక్రయాలు.. నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్
- May 09, 2023
రియాద్: కొకైన్ స్మగ్లింగ్, విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు సౌదీలు, ఒక నైజీరియన్ సహా ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్టు చేశారు. వారి నుంచి దాదాపు 2.2 కిలోల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. రియాద్ నగరం, జెడ్డా గవర్నరేట్లో 2.2 కిలోల కొకైన్ను అక్రమంగా తరలించడానికి, విక్రయించడానికి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు రియాద్ పోలీసు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ముఠా సభ్యులలో జెడ్డా గవర్నరేట్లో ఉన్న ఒక నైజీరియన్ జాతీయుడు కూడా ఉన్నాడని, అతను కొకైన్ స్మగ్లింగ్లో పాల్గొన్నాడని, అయితే ఒక పౌరుడు రియాద్ నగరంలో వ్యవస్థీకృత కొకైన్ అమ్మకంలో నిమగ్నమై ఉన్న మరో ఇద్దరు పౌరుల ముఠాకు నాయకత్వం వహించారని తెలిపారు. ముఠా సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, వారిని సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు వెల్లడించారు. మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్లోని ప్రాంతాలలో 911 నంబర్కు.. సౌదీలోని మిగిలిన ప్రాంతాలలో 999 నంబర్కు కాల్ చేయడం ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ లేదా విక్రయాలకు సంబంధించిన ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారాన్ని తెలియజేయాలని సౌదీ పౌరులు, ప్రవాసులకు భద్రతా అధికారులు పిలుపునిచ్చారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్ కంట్రోల్ (GNDC)కి 995 నంబర్ ద్వారా లేదా [email protected] అనే ఇ-మెయిల్ ద్వారా రిపోర్ట్ చేయాల్సిందిగా కూడా సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా పెడతామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







