ఒమన్‌లో 60 మందికి పైగా ప్రవాస కార్మికులు అరెస్టు

- May 11, 2023 , by Maagulf
ఒమన్‌లో 60 మందికి పైగా ప్రవాస కార్మికులు అరెస్టు

మస్కట్: ఒమన్ లో కార్మిక చట్టాలను ఉల్లంఘించిన 60 మందికిపైగా ప్రవాస కార్మికులను అరెస్ట్ చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ (MOL) తెలిపింది. కార్మిక మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్‌లో ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్, సీబ్ మున్సిపాలిటీ, రాయల్ ఒమన్ పోలీస్ (ROP) సహకారంతో సీబ్ విలాయత్‌లో తనిఖీ ప్రచారాలను నిర్వహించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా చట్టాలను ఉల్లంఘించిన 42 మంది కార్మికులను అరెస్టు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, 32 మంది కార్మికులను బహిష్కరించినట్లు తెలిపింది. అంతకుముందు, ధోఫర్ గవర్నరేట్‌లోని సంయుక్త తనిఖీ బృందం తనిఖీ ప్రచారాలను నిర్వహించింది. కార్మిక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన 27 మంది కార్మికులను అరెస్టు చేశారు.

ఏప్రిల్ 2023లో ఒమన్‌లో 480 మంది ప్రవాస కార్మికులను బహిష్కరించారు. మస్కట్ గవర్నరేట్‌లో జరిగిన తనిఖీ ప్రచారాల ఫలితంగా 142 మంది నాన్-ఓమనీ వర్క్‌ఫోర్స్‌ను అరెస్టు చేశారు. వీరిలో నాన్-ఓనర్ వద్ద పనిచేస్తున్న 48 మంది కార్మికులు, 83 మంది స్వయం ఉపాధి కార్మికులు, ఒమనైజ్డ్ వృత్తులలో పనిచేస్తున్న 10 మంది కార్మికులు ఉన్నారు. నెలలో మొత్తం 485 మందిని ఒమన్ నుంచి బహిష్కరించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com