సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..
- May 16, 2023
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 18న తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం అవుతుంది. రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కొన్ని నెలల్లో జరగనుండడంతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
కొత్త సచివాలయంలో తొలిసారి జరగనున్న కేబినెట్ సమావేశం ఇది. ఇటీవలే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబరులో షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉంది. కర్ణాటక ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణ కేబినెట్ సమావేశం అవుతుండడంతో మరింత ప్రాధాన్యం నెలకొంది.
చివరిసారి ఫిబ్రవరి 5న కూడా తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. బడ్జెట్ కు ఆమోదం తెలపడంతో పాటు 4 కొత్త ఆసుపత్రుల నిర్మాణం కోసం రుణానికి కేబినెట్ ఆ రోజున ఆమోదం తెలిపింది. వాటితో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కొన్ని నెలలుగా… తెలంగాణ కేబినెట్ సమావేశమైన ప్రతిసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారం జరిగింది. అయితే, ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని ఇప్పటికే పలుసార్లు కేసీఆర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







