ఐపీఎల్ 2023: హైదరాబాద్ పై బెంగళూరు ఘన విజయం
- May 18, 2023
హైదరాబాద్: ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బెంగళూరు ఓపెనర్లు దుమ్మురేపారు. విరాట్ కోహ్లి సెంచరీతో ఉతికారేయడంతో ఉప్పల్ వేదికగా సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సన్రైజర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లి (100; 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకంతో చెలరేగగా డుప్లెసిస్(71; 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టాడు. సన్రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్ చెరో వికెట్ తీశారు.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్(104 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ చేశాడు. 49 బంతుల్లో ఐపీఎల్లో తన మొదటి శతకాన్ని అందుకున్నాడు. మిగిలిన వారిలో హ్యారీ బ్రూక్( 27నాటౌట్ 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అభిషేక్ శర్మ(11), రాహుల్ త్రిపాఠి(15), మార్క్రమ్(18)లు విఫలం అయ్యారు. బెంగళూరు బౌలర్లలో బ్రేస్వెల్ రెండు వికెట్లు తీయగా, సిరాజ్, షాబాద్ అహ్మద్, హర్షల్ పటేల్లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







