అరబ్ ఐక్యతకు ‘జెడ్డా డిక్లరేషన్’
- May 20, 2023
జెడ్డా: ప్రజలకు శ్రేయస్సు, సంక్షేమంతో పాటు సురక్షితమైన, స్థిరమైన ప్రాంతాన్ని సాధించడానికి తమ ఐక్యతను మరింత సుస్థిరం చేసుకోవాల్సిన అవసరాన్ని ఒక-రోజు శిఖరాగ్ర సమావేశంలో అరబ్ నాయకులు పునరుద్ఘాటించారు. 32వ సాధారణ శిఖరాగ్ర సమావేశం ముగింపులో నాయకులు ఆమోదించిన జెడ్డా డిక్లరేషన్ ద్వారా సుస్థిర అభివృద్ధి, భద్రత, స్థిరత్వం, శాంతియుత సహజీవనం అరబ్ పౌరుల స్వాభావిక హక్కులు అని ప్రకటించారు. అరబ్ దేశాల్లో నేరాలను ఎదుర్కోవడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ సమ్మిట్కు అధ్యక్షత వహించారు. ఇందులో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ మొదటిసారి పాల్గొన్నారు. 22 సభ్యుల కూటమిలో దశాబ్ద కాలంగా సిరియా దూరంగా ఉంది.
పాలస్తీనా-ఇజ్రాయెల్ వివాదం, సూడాన్, యెమెన్, లిబియా మరియు లెబనాన్లలో తాజా పరిణామాలతో సహా దాని ఎజెండాలోని ప్రధాన అంశాలపై ఈ సదస్సు చర్చించింది. అరబ్ దేశాల అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాలను డిక్లరేషన్ తిరస్కరించింది. "సాయుధ మిలీషియాల ఏర్పాటుకు మద్దతు ఇవ్వడాన్ని మేము పూర్తిగా తిరస్కరిస్తున్నాము. అంతర్గత సైనిక వివాదాలు ప్రజల బాధలను మరింత తీవ్రతరం చేస్తాయని హెచ్చరిస్తున్నాము" అని డిక్లరేషన్ లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







