వాయిదాల విక్రయాలను నిలిపివేయనున్న ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్ కంపెనీలు..!
- May 20, 2023కువైట్: ప్రధాన ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్ కంపెనీలు వాయిదాల పద్దతిలో వస్తువుల అమ్మకాలను నిలిపివేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయా రంగాల్లోని కంపెనీలు అధ్యయనం చేస్తున్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. వాయిదాలలో విక్రయించే వస్తువుల విలువను ప్రకటించిన ధర కంటే పెంచకూడదని వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి నిర్ణయం తీసుకున్న తర్వాత కంపెనీలు ఈ చర్యను చేపట్టినట్లు తెలుస్తోంది. 3 సంవత్సరాలకు మించని వ్యవధిలో సమాన నెలవారీ వాయిదాలలో చెల్లించడానికి ఐదు వేల దినార్లకు వాయిదాల అమ్మకాలను సీలింగ్ను సెట్ చేయాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, ఈ నిర్ణయం ఎలక్ట్రానిక్, ఫర్నిచర్ కంపెనీలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని, దేశంలోని ప్రధాన కంపెనీలు వాయిదాల విక్రయాలను నిలిపివేసే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?