వాయిదాల విక్రయాలను నిలిపివేయనున్న ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్ కంపెనీలు..!
- May 20, 2023
కువైట్: ప్రధాన ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్ కంపెనీలు వాయిదాల పద్దతిలో వస్తువుల అమ్మకాలను నిలిపివేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయా రంగాల్లోని కంపెనీలు అధ్యయనం చేస్తున్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. వాయిదాలలో విక్రయించే వస్తువుల విలువను ప్రకటించిన ధర కంటే పెంచకూడదని వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి నిర్ణయం తీసుకున్న తర్వాత కంపెనీలు ఈ చర్యను చేపట్టినట్లు తెలుస్తోంది. 3 సంవత్సరాలకు మించని వ్యవధిలో సమాన నెలవారీ వాయిదాలలో చెల్లించడానికి ఐదు వేల దినార్లకు వాయిదాల అమ్మకాలను సీలింగ్ను సెట్ చేయాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, ఈ నిర్ణయం ఎలక్ట్రానిక్, ఫర్నిచర్ కంపెనీలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని, దేశంలోని ప్రధాన కంపెనీలు వాయిదాల విక్రయాలను నిలిపివేసే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







