7 మంత్రిత్వ శాఖల్లోని 84 మంది ఉద్యోగులు అరెస్ట్
- May 22, 2023
రియాద్: అనేక అవినీతి నేరాలకు పాల్పడిన తరువాత షవ్వాల్ నెలలో 7 మంత్రిత్వ శాఖలలో 84 మందిని అరెస్టు చేసినట్లు సౌదీ పర్యవేక్షణ, అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) ఆదివారం తెలిపింది. అనేక క్రిమినల్, అడ్మినిస్ట్రేటివ్ కేసుల నిర్వహణను అథారిటీ చేపట్టింది. ఇందులో భాగంగా నజాహా 2,583 పర్యవేక్షణ పర్యటనలను నిర్వహించింది. దీని ఫలితంగా 211 మందిపై విచారణ చేపట్టింది. అధికార దుర్వినియోగం, లంచం, మనీలాండరింగ్, ఫోర్జరీ మధ్య విభిన్నమైన అనేక అవినీతి నేరాలలో నిందితులు ప్రమేయం ఉన్నారని, అరెస్టయిన 84 మందిలో కొంతమంది బెయిల్పై విడుదలయ్యారని నజాహా తెలిపింది. అరెస్టయిన వారు జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ (ZATCA) వ్యక్తులతో పాటు అంతర్గత, రక్షణ, నేషనల్ గార్డ్, న్యాయం, ఆరోగ్యం, విద్య, పురపాలక, గ్రామీణ వ్యవహారాలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖలకు చెందినవారు ఉన్నారని పేర్కొంది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







