అబుధాబిలో అగ్ని ప్రమాదం..6 మంది మృతి, 7 మందికి గాయాలు
- May 22, 2023
యూఏఈ: అబుధాబిలోని మువాజాజ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. ఏడుగురికి గాయాలైనట్లు యూఏఈ క్యాపిటల్ సివిల్ డిఫెన్స్ తెలిపింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మంటలు అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. సివిల్ డిఫెన్స్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గత నెలలో దుబాయ్లోని అల్ రాస్లోని నివాస భవనంలోని నాల్గవ అంతస్తులో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 16 మంది మరణించగా.. తొమ్మిది మంది గాయపడ్డ విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







