అబుధాబిలో అగ్ని ప్రమాదం..6 మంది మృతి, 7 మందికి గాయాలు
- May 22, 2023
యూఏఈ: అబుధాబిలోని మువాజాజ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. ఏడుగురికి గాయాలైనట్లు యూఏఈ క్యాపిటల్ సివిల్ డిఫెన్స్ తెలిపింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మంటలు అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. సివిల్ డిఫెన్స్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గత నెలలో దుబాయ్లోని అల్ రాస్లోని నివాస భవనంలోని నాల్గవ అంతస్తులో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 16 మంది మరణించగా.. తొమ్మిది మంది గాయపడ్డ విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







