అబుధాబిలో అగ్ని ప్రమాదం..6 మంది మృతి, 7 మందికి గాయాలు
- May 22, 2023యూఏఈ: అబుధాబిలోని మువాజాజ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. ఏడుగురికి గాయాలైనట్లు యూఏఈ క్యాపిటల్ సివిల్ డిఫెన్స్ తెలిపింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మంటలు అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. సివిల్ డిఫెన్స్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గత నెలలో దుబాయ్లోని అల్ రాస్లోని నివాస భవనంలోని నాల్గవ అంతస్తులో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 16 మంది మరణించగా.. తొమ్మిది మంది గాయపడ్డ విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక