అబుధాబిలో అగ్ని ప్రమాదం..6 మంది మృతి, 7 మందికి గాయాలు
- May 22, 2023యూఏఈ: అబుధాబిలోని మువాజాజ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. ఏడుగురికి గాయాలైనట్లు యూఏఈ క్యాపిటల్ సివిల్ డిఫెన్స్ తెలిపింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మంటలు అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. సివిల్ డిఫెన్స్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గత నెలలో దుబాయ్లోని అల్ రాస్లోని నివాస భవనంలోని నాల్గవ అంతస్తులో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 16 మంది మరణించగా.. తొమ్మిది మంది గాయపడ్డ విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ