అయోధ్య రామమందిరం..భక్తులకు శుభవార్త...
- May 22, 2023
అయోధ్య రామమందిరం నిర్మాణం గురించి కీలక విషయాలు వెల్లడించారు రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా. డిసెంబర్ లోగా రామమందిరం మొదటి దశ పనులు పూర్తవుతాయన్నారు. రూ.1400 -1800 కోట్ల ఖర్చుతో ఆలయ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. డిసెంబర్ 30, 2023 నాటికి మొదటి దశ రామ మందిర నిర్మాణం పూర్తి చేయాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయించిందన్నారు. ఆలయాన్ని మూడు దశల్లో నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మొదటి దశ పూర్తయిన తర్వాతే భక్తులకు ఆలయ ప్రవేశం కల్పిస్తామన్నారు.
2024 డిసెంబర్ 30 నాటికి 1వ, 2వ అంతస్థులు పూర్తవుతాయి. ప్రజలు డిసెంబర్ 30, 2023 నాటికి రాముడికి ప్రార్థనలు చేయాలని మేము ప్రయత్నిస్తున్నాము. మొదటి దశలో గ్రౌండ్ ఫ్లోర్లోని 5 మండపాలు, గర్భగుడి, విగ్రహ ప్రతిష్టాపన ఇతర పనులు పూర్తి చేస్తాం. 5 మండపాల నిర్మాణంలో దాదాపు 160 పిల్లర్లు ఉన్నాయి.
పిల్లర్ల పై శిల్పాలు, చిత్రాలు, చిహ్నాల పని పూర్తి చేయాలి. ఆలయ దిగువపీఠంపై శ్రీరాముని సంక్షిప్త వివరణ ప్రారంభించబడుతుంది. విద్యుత్ సౌకర్యం, ఇతర సౌకర్యాల పనులు మొదటి దశలో పూర్తి చేయాలి. ఆలయ బయటి ప్రాంగణం సహా మొదటి, రెండవ అంతస్తులు 2024 డిసెంబర్ 30 నాటికి పూర్తవుతాయి. 2025 డిసెంబర్ నాటికి పూర్తి ఆలయ సముదాయం సిద్ధమవుతుంది” అని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







