కశ్మీర్లో రామ్ చరణ్.! ఇండియన్ ఫిలిం ఇండస్ర్టీకి ప్రతినిధిగా.!
- May 23, 2023
‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు అంతర్జాతీయ వేదికలపై ఇండియాన్ సినిమా గొప్పతనాన్ని చాటి చెబుతూ అనేక ఇంటర్నేషనల్ సదస్సులకు హాజరవుతూ వస్తున్నారు.
తాజాగా కశ్మీర్లో జరుగుతున్న జీ 20 ఫిలిం సదస్సుకు ఇండియా నుంచి ప్రతినిధిగా రామ్ చరణ్ హాజరయ్యారు. ఇండియాలో అనేక అందమైన లొకేషన్లున్నాయనీ, ప్రకృతి రమణీయతకు ఇండియా పెట్టింది పేరు అని ఆయన ఆ వేదికపై వ్యాఖ్యానించారు.
హాలీవుడ్ ఫిలింస్లో తాను నటించాల్సి వస్తే ఇండియాలోనే షూటింగ్ చేయాలని చెబుతానని చెప్పారు. ఇండియన్ లొకేషన్ల గొప్పతనాన్ని హాలీవుడ్ దర్శకులకు తెలియచెబుతానని చెప్పారు.
17 దేశాల నుంచి ఫిలిం టూరిజం అభివృద్ది, సాంస్కృతిక పరిరక్షణ తదితర అంశాలు ఈ సదస్సులో చర్చకు రానున్నాయ్.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









