కశ్మీర్‌లో రామ్ చరణ్.! ఇండియన్ ఫిలిం ఇండస్ర్టీకి ప్రతినిధిగా.!

- May 23, 2023 , by Maagulf
కశ్మీర్‌లో రామ్ చరణ్.! ఇండియన్ ఫిలిం ఇండస్ర్టీకి ప్రతినిధిగా.!

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు అంతర్జాతీయ వేదికలపై ఇండియాన్ సినిమా గొప్పతనాన్ని చాటి చెబుతూ అనేక ఇంటర్నేషనల్ సదస్సులకు హాజరవుతూ వస్తున్నారు.

తాజాగా కశ్మీర్‌లో జరుగుతున్న జీ 20 ఫిలిం సదస్సుకు ఇండియా నుంచి ప్రతినిధిగా రామ్ చరణ్ హాజరయ్యారు. ఇండియాలో అనేక అందమైన లొకేషన్లున్నాయనీ, ప్రకృతి రమణీయతకు ఇండియా పెట్టింది పేరు అని ఆయన ఆ వేదికపై వ్యాఖ్యానించారు.

హాలీవుడ్ ఫిలింస్‌లో తాను నటించాల్సి వస్తే ఇండియాలోనే షూటింగ్ చేయాలని చెబుతానని చెప్పారు. ఇండియన్ లొకేషన్ల గొప్పతనాన్ని హాలీవుడ్ దర్శకులకు తెలియచెబుతానని చెప్పారు.

17 దేశాల నుంచి ఫిలిం టూరిజం అభివృద్ది, సాంస్కృతిక పరిరక్షణ తదితర అంశాలు ఈ సదస్సులో చర్చకు రానున్నాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com