మహేశ్ భగవత్ శిక్షణలో 125 మందికి సివిల్స్లో ర్యాంకులు
- May 23, 2023
హైదరాబాద్: పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ దగ్గర శిక్షణ పొందిన విద్యార్థులు సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. ర్యాంకుల పంట పండించారు. మహేష్ భగవత్ శిక్షణ ఇచ్చిన 125 మందికి ర్యాంకుల వచ్చాయి. మహేశ్ భగవత్ పోలీస్ కమిషనర్ గా పని చేస్తూనే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అలా ఆయన దగ్గర శిక్షణ పొందిన వారికి జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు వచ్చాయి. ఆల్ ఇండియా సివిల్స్ ర్యాంక్స్ మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థికి శిక్షణ ఇచ్చింది మహేశ్ భగవతే కావడం విశేషం. మొత్తం 125 మంది ర్యాంకులు సాధించారు.
దీనిపై మహేశ్ భగవత్ స్పందించారు. విద్యార్థులకు బోధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తాను శిక్షణ ఇచ్చిన విద్యార్థులు ర్యాంకులు సాధించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ”నేను ఇంటర్వ్యూ సబ్జెక్ట్ చెప్పాను. మొత్తం 700 మందికి బోధించాను. అందులో 120 నుండి 150 మందికి ర్యాంకులు వచ్చాయి. ర్యాంకులు సాధించిన వారు నిస్వార్థంతో ప్రజలకు సేవ చేయాలి” అని మహేశ్ భగవత్ అన్నారు.
మహేశ్ భగవత్ దగ్గర శిక్షణ పొందిన విద్యార్థులకు వచ్చిన ర్యాంకులు..
ర్యాంక్ 1 – ఇషితా కిషోర్ (యూపీ)
ర్యాంక్ 14 – కృతిక్ గోయల్ (హర్యానా)
ర్యాంక్ 22- GVS పవన్ దత్త
ర్యాంక్ 25 – కాశ్మీర సాంకేత్
ర్యాంక్ 35 – అజ్మీరా సాంకేత్ కుమార్
ర్యాంక్ 38 – అనూప్ దాస్
ర్యాంక్ 54 – రిచా కులకర్ణి
ర్యాంక్ 74 – అయిషి జాయిన్
ర్యాంక్ 76 – వసంత్ దాభోల్కర్
ర్యాంక్ 78 – ఉత్కర్ష కుమార్ (తెలంగాణ)
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







