కాంగోలో భారీ వర్షాలు : 443 మందికి చేరిన మృతుల సంఖ్య
- May 24, 2023
కిన్హాసా: దక్షిణాఫ్రికా దేశమైన కాంగోలో మే నెల ప్రారంభంలో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల వల్ల వందలాది మంది మృతి చెందారు. తాజాగా ఈ భారీ వర్షాల కారణంగా మృతుల సంఖ్య 443 మందికి చేరిందని యుఎన్ ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్ (ఓసిహెచ్ఎ) మంగళవారం వెల్లడించింది. కాంగోలో కురిసిన భారీ వర్షాలకు ఎంతోమంది గాయపడ్డారని ఓసిహెచ్ఎ తెలిపింది. ఇక వరదలు, కొండచరియలు విరిగిపడం వలన అనేకమంది వ్యక్తుల ఆచూకీ తెలియలేదని ఓసిహెచ్ఎ పేర్కొంది. ప్రధానంగా వర్షాల వల్ల దక్షిణ కివు ప్రావిన్స్లో తూర్పు భూభాగంలోని కలేహే ప్రాంతలో మృతదేహాలను వెలికితీయడానికి లేదా పాతిపెట్టడానికి భారీ పరికరాలను అత్యవసరంగా అందజేయాలని రెస్క్యూ సిబ్బంది అభ్యర్థిస్తున్నారని ఓసిహెచ్ఎ తెలిపింది.
కాగా, ఈ వర్షాల వల్ల మూడు వేల కంటే ఇళ్లు, 9 వేలకు పైగా పాఠశాలలు దెబ్బతిన్నాయని ఓసిహెచ్ పేర్కొంది. అయితే అక్కడున్న ప్రజలకు ఆహారం, పాలు నీరు వంటివాటిని మానవతా వాదులు సరఫరా చేస్తున్నారు. వర్షా ప్రభావిత బాధితులకు ఆదుకునేందుకు సహాయక చర్యల్లో భాగంగా.. కాంగోలోని యుఎన్ హ్యుమానిటేరియన్ కోఆర్డినేటర్ బ్రూనో లెమార్క్విస్.. హ్యుమానిటేరియన్ ఫండ్ నుండి 3 మిలియన్ డాలర్లను కాంగోకి సాయం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







