కాంగోలో భారీ వర్షాలు : 443 మందికి చేరిన మృతుల సంఖ్య
- May 24, 2023
కిన్హాసా: దక్షిణాఫ్రికా దేశమైన కాంగోలో మే నెల ప్రారంభంలో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల వల్ల వందలాది మంది మృతి చెందారు. తాజాగా ఈ భారీ వర్షాల కారణంగా మృతుల సంఖ్య 443 మందికి చేరిందని యుఎన్ ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్ (ఓసిహెచ్ఎ) మంగళవారం వెల్లడించింది. కాంగోలో కురిసిన భారీ వర్షాలకు ఎంతోమంది గాయపడ్డారని ఓసిహెచ్ఎ తెలిపింది. ఇక వరదలు, కొండచరియలు విరిగిపడం వలన అనేకమంది వ్యక్తుల ఆచూకీ తెలియలేదని ఓసిహెచ్ఎ పేర్కొంది. ప్రధానంగా వర్షాల వల్ల దక్షిణ కివు ప్రావిన్స్లో తూర్పు భూభాగంలోని కలేహే ప్రాంతలో మృతదేహాలను వెలికితీయడానికి లేదా పాతిపెట్టడానికి భారీ పరికరాలను అత్యవసరంగా అందజేయాలని రెస్క్యూ సిబ్బంది అభ్యర్థిస్తున్నారని ఓసిహెచ్ఎ తెలిపింది.
కాగా, ఈ వర్షాల వల్ల మూడు వేల కంటే ఇళ్లు, 9 వేలకు పైగా పాఠశాలలు దెబ్బతిన్నాయని ఓసిహెచ్ పేర్కొంది. అయితే అక్కడున్న ప్రజలకు ఆహారం, పాలు నీరు వంటివాటిని మానవతా వాదులు సరఫరా చేస్తున్నారు. వర్షా ప్రభావిత బాధితులకు ఆదుకునేందుకు సహాయక చర్యల్లో భాగంగా.. కాంగోలోని యుఎన్ హ్యుమానిటేరియన్ కోఆర్డినేటర్ బ్రూనో లెమార్క్విస్.. హ్యుమానిటేరియన్ ఫండ్ నుండి 3 మిలియన్ డాలర్లను కాంగోకి సాయం చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







